English | Telugu

కేసీఆర్ కి కేటీఆర్ కి సింగర్ శ్రీరామచంద్ర విన్నపం!

సింగర్ శ్రీరామచంద్ర తీవ్ర అసహనానికి గురయ్యారు. దానికి కారణం ఆయన వెళ్లాల్సిన గోవా ఫ్లైట్ మిస్ కావడమే. మరి ఆయన ఫ్లైట్ మిస్ ఐతే కేసీఆర్ , కేటీఆర్ మీద ఎందుకు అసహనం వ్యక్తం చేశారనుకుంటున్నారా..ఒక పొలిటీషియన్ వస్తున్న సందర్భంగా పీవీ నరసింహారావు ఫ్లై ఓవర్ ని బ్లాక్ చేశారు. దాంతో ట్రాఫిక్ అంత ఫ్లై ఓవర్ కింద ఉండిపోయింది. ఆ హెవీ ట్రాఫిక్ కారణంగా ఎయిర్ పోర్ట్ కి అరగంట ఆలస్యంగా వెళ్లాల్సి వచ్చిందట. దాంతో ఆయన వెళ్లాల్సిన గోవా ఫ్లైట్ మిస్ అయ్యింది. గోవాలో ఒక ఈవెంట్లో పాల్గొనాల్సి ఉండడం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇలా ప్లాన్ అంతా చేంజ్ అయ్యేసరికి శ్రీరామచంద్ర తీవ్ర అసహనానికి గురయ్యారు.

ఇలాంటి టైములో మరో ఫ్లైట్ ని క్యాచ్ చేసి గోవా వెళ్లడం ఎంతో కష్టమైన పని. ఆయనతో పాటు ఇంకొంతమంది కూడా ఆ ఫ్లైట్ మిస్ అయ్యారట. "తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ గారికి, సైబరాబాద్ పోలీసులకు నేను విన్నవించేది ఏమిటంటే.. పొలిటికల్ లీడర్స్ కోసం మాలాంటి సామాన్యులను ఇబ్బంది పెట్టకండి"... అంటూ ట్విట్టర్ లో ఒక వీడియో షేర్ చేశారు.

సింగర్ శ్రీరామచంద్ర చేసిన ట్వీట్ కి మిశ్రమ స్పందన వచ్చింది. "ఈవెంట్ కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇంకా ముందుగా బయల్దేరాల్సింది" అని అంటే "ఎలాంటి రోడ్ షోస్ వంటివి ఉన్నప్పుడు ప్రజలకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని తెలీదా..పొలిటీషియన్స్ కోసం మన విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకోవాలా " అంటూ ఇంకొంతమంది కామెంట్స్ చేశారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.