English | Telugu

చంద్రబోస్‌తో హైపర్ ఆది గొడవ... ఎక్కి ఎక్కి ఏడ్చిన రష్మీ


శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోలో హోస్ట్ రష్మీ ఎప్పుడూ లేనంతగా ఏడ్చేసింది. చంద్రబోస్ ఒక పాట పాడి ఆమెను ఏడిపించారు. ఈ షోకి "బాడ్ గర్ల్స్" మూవీ టీమ్ నుంచి గీత రచయిత చంద్రబోస్, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ వచ్చారు. ప్రోమో స్టార్టింగ్ నుంచి ఫుల్ జోష్ తో సాగింది. రష్మీ కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది కానీ ప్రోమో లాస్ట్ లో ఐతే రష్మీ అదే పనిగా ఏడుస్తూనే ఉంది. జీవితంలో ఒక్క మనిషైనా మన కోసం ఉంటె ఆ ఆనందమే వేరు. అది అమ్మాయైనా , అబ్బాయైనా...ఇక్కడ రష్మీ బాధ కూడా అదే. ప్రోమో చివరిలో అనూప్ రూపెన్స్ గిటార్ ప్లే చేస్తుంటే చంద్రబోస్ ఒక సాంగ్ పాడారు. "ఇలా చూసుకుంటానే ఇలా చూసుకుంటానే చెలి నిన్ను కలకాలం ఇలా చూసుకుంటానే..కన్నీళ్లను అడుగుతానే నవ్వుల్లోనే రావాలని...దూరాన్నీ అడుగుతానే ఏడడుగులతో ఆగాలని...మరణాన్నే అడుగుతానే ఇద్దరికీ ఒకేసారి రావాలని" అంటూ ఒక హార్ట్ టచ్చింగ్ సాంగ్ ని పాడారు. ఆ పాట పట్టినంత సేపు రష్మీ ఏడుస్తూనే ఉంది. "నిజంగా మీ పాట విన్న తర్వాత మనస్ఫూర్తిగా ఇలాంటి ఒక అబ్బాయి దొరికితే మాత్రం అదృష్టమే అనుకోవాలి." అంటూ చెప్పి మళ్ళీ ఏడ్చింది. దాంతో చంద్రబోస్ కూడా పాపం చాలా ఫీలయ్యారు రష్మీ మాటలకు. ఇక ఆ పాట పాడే టైములో ఆది వెళ్లి చంద్రబోస్ కాళ్ళు మొక్కాడు. బుల్లితెర మీద రష్మీ - సుధీర్ జోడి చేసిన మ్యాజిక్ గురించి అందరికీ తెలుసు. చాలా షోస్ లో వీళ్లకు పెళ్లి కూడా చేసేసారు. రియల్ లైఫ్ లో కూడా ఇద్దరికీ పెళ్ళైపోతుంది అని అంతా ఎదురు చూసారు. కానీ ఇద్దరూ వేరైపోయారు. సుధీర్ ఛానెల్ చేంజ్ ఐపోయాడు అలాగే మూవీస్ లో నటిస్తున్నాడు. ఏ షోలో సుధీర్ టాపిక్ వచ్చిన రష్మీ రియాక్షన్ కొంచెం డల్ గా కనిపిస్తుంది. ఇక ఇప్పుడు చంద్రబోస్ సాంగ్ కి కూడా రష్మీ ఏడ్చేసింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.