English | Telugu

Jayam serial: రుద్రకి సన్మానం.. వీరు, పారుల ప్లాన్ ఏంటంటే?

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -182 లో... గంగపై ఇంట్లో అందరు కోప్పడతారు. రుద్ర కోపంగా ఉంటాడు. తన దగ్గరికి గంగ వచ్చి, సారీ చెప్తుంది. నువ్వు ఎందుకు ప్రతీసారీ వీరుని టార్గెట్ చేస్తున్నావని రుద్ర అడుగుతాడు. మీకు అంతా వివరంగా చెప్పగలను కానీ సాక్ష్యాలు చూపించలేనని మళ్ళీ వీరు గురించి అంటుంటే రుద్రకి ఇంకా కోపం వస్తుంది.

ఆ తర్వాత థాంక్స్ ఇషిక.. టైమ్ కి రింగ్ ఇచ్చి సేవ్ చేసావని ఇషికతో వీరు అంటాడు. ఆ గ్యాంగ్ లో గంగ ఉందని హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక దాని టెన్షన్ ఉండొద్దు లేపెయ్యాలని ఇషికతో వీరు అంటాడు. ఆ తర్వాత ప్రీతీకి గంగ సారీ చెప్పగానే ప్రీతీ కూల్ అవుతుంది.

ఆ తర్వాత సీఎం పీఏ పెద్దసారు దగ్గరికి వస్తాడు. మీ అబ్బాయి నిన్న ఒక మాఫియా నుండి కొంతమంది అమ్మాయిలని సేవ్ చేసాడని సన్మానం చెయ్యాలని డిసైడ్ అయ్యారని చెప్పగానే ఇంట్లో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. బయట సన్మానం.. ఇంట్లో అవమానం అని శకుంతల అంటుంది. నువ్వు రావా రేపు అని పెద్దసారు అనగానే రానని శకుంతల చెప్తుంది. పెద్దమ్మ రాకుంటే వద్దని రుద్ర అంటాడు. మీ పెద్దమ్మని నేను ఒప్పిస్తానని పెద్దసారు అంటాడు. ఆ తర్వాత పెద్దసారు శకుంతల దగ్గరికి వెళ్లి రేపు ప్రశంసలు మొత్తం నేనే తీసుకోవాలా.. నీకు వద్దా అని మాట్లాడుతుంటే శకుంతల ఒప్పుకుంటుంది.

ఆ తర్వాత ప్రీతీ దగ్గరికి రుద్ర వచ్చి సారీ చెప్తాడు. నేను ఎప్పుడో మార్చిపోయాను అన్నయ్య.. గంగ ఏది అనుకుంటే అదే మాట్లాడుతుంది. మనసులో ఏం దాచుకోదని ప్రీతీ అంటుంది. గంగ దగ్గరికి రుద్ర వెళ్లి సన్మానానికి ఈ చీర కట్టుకోమని చెప్తాడు. కానీ కట్టుకోనని గంగ అంటుంటే నిన్ను ఇలా కాదు అని తన చేయి మెలి పెడతాడు రుద్ర. దాంతో రుద్రని గంగ హగ్ చేసుకొని.. మీరు నాకు దూరం అయితే నేను తట్టుకోలేనని ఏడుస్తుంది.

మరొకవైపు సన్మానం గురించి ఇషిక, వీరు మాట్లాడుకుంటారు. అప్పుడే పారు ఫోన్ చేస్తుంది. తనకి జరిగిందంతా చెప్తారు. దాంతో పారు ఒక ప్లాన్ వాళ్లకి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : మినిస్టర్ కి ఎదురుతిరిగిన కావ్య.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -943 లో..... కావ్య తన కూతురు మినిస్టర్ దగ్గర ఉందని తెలిసి వెంటనే అక్కడికి వెళ్లి మినిస్టర్ తో గొడవపడుతుంది. నా బిడ్డని నాకెందుకు దూరం చేశారని కావ్య అడుగుతుంది. ఓహ్ నిజం తెలిసిపోయిందా నా బిడ్డ అనారోగ్యంగా ఉందని నా భార్యకి తెలిస్తే తట్టుకోలేదు అందుకే బిడ్డని మార్చేసాను.. అయిన నీ బిడ్డ అనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా.. లేదు కదా.. నీ బిడ్డని నీకు ఇచ్చే ప్రసక్తే లేదని కావ్యతో మినిస్టర్ అంటాడు. నా బిడ్డని పదిహేను రోజుల్లో నా దగ్గరికి చేర్చుకుంటానని మినిస్టర్ కి కావ్య వార్నింగ్ ఇస్తుంది.

Brahmamudi : మినిస్టర్ ఇంటికి రాజ్, కావ్య.. తమ పాపని దక్కించుకుంటారా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -942 లో...... కావ్య తన బిడ్డ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో డాక్టర్ హెల్ప్ చేస్తుంది. డెలివరీ అయిన లిస్ట్ లో మినిస్టర్ భార్య తులసి ఉందని చెప్తుంది. ఈ కేసు డీల్ చేసింది డాక్టర్ చక్రవర్తి.  ఆయన రావడం లేదు. తనకి అసిస్టెంట్ గా  నీలవేణి నర్సు ఉందని కావ్యతో చెప్తుంది డాక్టర్ అనురాధ. మరొకవైపు నర్సు నీలవేణి ఇంకొక సిస్టర్ మాట్లాడుకుంటారు. ఈ గోల్డ్ చైన్ తీసుకున్నానని నర్సు అనగానే నేను చూడు పది లక్షలు పెట్టి తీసుకున్నానని నీలవేణి నర్సు అంటుంది.