English | Telugu

మేము ఎలాంటి తప్పు చేయలేదు.. పెళ్లి చేసుకోబోతున్నాం!

ఢీ డాన్సర్ జాను మీద కొన్ని వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. జాను తన మీద వస్తున్న రూమర్స్ కి అలాగే పెళ్లి చేసుకోబోతోందన్న విషయం మీద ఏడుస్తూ కూడా వీడియోస్ చేసింది. ఐతే ఇప్పుడు జాను పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్ దేవగన్ రీసెంట్ గా ఒక వీడియోని రిలీజ్ చేసాడు.

"నేను జానుతో ఉన్న ఫోటోని బాగా ట్రోల్ చేస్తున్నారు. ఐతే అది నిజమే. నేను జాను ఇష్టపడ్డాం. మేము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. అందరి అంగీకారం మేరకే పెళ్లి చేసుకోబోతున్నాం. మేము ఎలాంటి తప్పు చేయలేదు. మేము కలిసి బతకాలని అనుకుంటున్నాం. అలాంటి మా మీద రకరకాల కామెంట్స్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు మీడియాలో. మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్లందరికీ థ్యాంక్యూ సో మచ్" అని చెప్పాడు.

ఆ తర్వాత జాను వచ్చి "నేను ఏదైతే వీడియో చేసానో దానికి చాల మంది బాధపడ్డారు. కానీ మాకు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్లందరికీ థ్యాంక్యూ సో మచ్. కొద్దీ రోజులుగా అన్ని గమనిస్తున్నాను. చివరికి తట్టుకోలేక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా..మా ఫామిలీ ఎక్కడ బాధపడుతుందో అని భయమేసింది అంతేకాని ఎవరికో భయపడి కాదు. నేను అలా భయపడే దాన్నీ ఐతే ఈ స్టేజికి వచ్చేదాన్ని కాదు. నేను నా బాబు హ్యాపీగా ఉన్నాం. నా మీద ఎన్నో ట్రోల్స్ వస్తున్నాయి. ఎవరు ఎన్ని అనుకున్నా నేను నా లైఫ్ లో ఎప్పుడూ స్ట్రాంగ్ గానే ఉన్నాను, ఉంటాను" అని చెప్పింది.

ఇక జాను ఏడుస్తూ చేసిన వీడియోస్ చాలా వైరల్ ఐపోయాయి. ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య దాదాపు 1 .5 మిలియన్స్ కి చేరిపోయారు. ఇక నెటిజన్స్ ఐతే ఆ జంటకి విషెస్ చెప్తూ మెసేజెస్ చేస్తున్నారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.