English | Telugu

Illu illalu pillalu : ధీరజ్ గురించి ఇంట్లో చర్చ.. అతని కోసం ఎదురుచూస్తూ ప్రేమ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -199 లో.....రామరాజు వాళ్లంతా రాత్రి భోజనం చేస్తుంటారు. ధీరజ్ ఇంకా ఇంటికి రాకపోవడంతో ఎక్కడికి వెళ్ళాడని వేదవతిని రామరాజు అడుగుతాడు. నాకేం తెలియదని వేదవతి అంటుంది. నర్మద, సాగర్ కి ధీరజ్ గురించి తెలిసి ఉంటుందని శ్రీవల్లి అనగానే నర్మద, సాగర్ ఇద్దరు టెన్షన్ పడతారు. మాకేం తెలియదని సాగర్, నర్మద చెప్తారు.

మరొకవైపు ధీరజ్ గురించి గుమ్మం దగ్గరే ఎదురుచూస్తుంటుంది ప్రేమ. అదే సమయంలో వేదవతి, నర్మద మాట్లాడుకుంటుంటే.. రామరాజుకి చూపిస్తుంది శ్రీవల్లి. దాంతో అక్కడికి వచ్చిన రామరాజు.. ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు.. ధీరజ్ ఎక్కడికి వెళ్ళాడో తెలుసా అని అడుగుతాడు. వాళ్ళు తెలియదని అంటారు. ఏమో నా వెనకాల జరుగుతుంది కానీ చెప్పట్లేదని రామరాజు అంటాడు. ఆ తర్వాత ప్రేమ దగ్గరికి వేదవతి వస్తుంది. నువ్వు మళ్ళీ మాకు తెలియకుండా ఏదైనా జాబ్ చెయ్యాలనుకుంటున్నావా ఇప్పటికే మీ మావయ్య గారు నా వల్ల ఇన్నాళ్లుగా మాటలు పడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ నీ వల్ల మాటలు పడేలా చెయ్యకని వేదవతి అంటుంది. అలాంటి ప్రయత్నం ఏం చెయ్యనని నాకు మాటివ్వు అనగానే వేదవతికి‌ ప్రేమ మాటిస్తుంది.

మరొకవైపు ధీరజ్ డే అంతా ఫుడ్ డెలివరీ చేసి రాత్రి డ్రైవింగ్ చేస్తుంటాడు. ధీరజ్ వచ్చేసరికి ప్రేమ గుమ్మం ముందు ఉంటుంది. నాకు నిద్రొస్తుందంటూ ధీరజ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కాస్త అన్నం తినమని ప్రేమ రిక్వెస్ట్ చేస్తుంది. కానీ నాకు నిద్రొస్తుందంటూ ధీరజ్ వెళ్లి పడుకుంటాడు. అప్పుడే ధీరజ్ కాలికి ఉన్న దెబ్బని ప్రేమ చూసి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. మరొకవైపు నర్మద చెప్పినట్టు సాగర్ గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.