English | Telugu

Brahmamudi : కలిసిపోయిన రాజ్, కావ్య.. ఇక ఇన్వెస్టిగేషన్ మొదలు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -627 లో.... కావ్యని రుద్రాణి తిడుతుంటే చూడలేక రాజ్ నిజం చెప్పాలని ప్రయత్నం చేయగా కావ్య వద్దని ఆపుతుంది. అవసరం ఉండి గెస్ట్ హౌస్ తాకట్టు పెట్టి పది కోట్లు అప్పు తీసుకున్నానని కావ్య చెప్తుంది.. చూసారా ఎలా చెప్తుందో వదిన.. నీ కొడుకుని డమ్మీని చేసి ఆడిస్తుందని అపర్ణతో రుద్రాణి అంటుంది.

నువ్వు అగు రుద్రాణి, కావ్య ఎందుకు అలా చేసిందో కనుక్కుంటా అని సుభాష్ అంటాడు. ఎందుకు ఇలా చేసావ్ అని కావ్యని సుభాష్ అడుగుతాడు. తాతయ్య గారు ఆస్తులన్నీ నా పేరున రాశారని, అవి తాకట్టు పెడతాను లేదా అమ్ముకుంటాను.. అడిగే అధికారం ఇంట్లో ఎవరికి లేదని కావ్య కఠినంగా మాట్లాడేసరికి అందరు షాక్ అవుతారు. అపర్ణ అయితే ఏకంగా మీ మావయ్యని అలా అంటావా అంటూ కావ్యపై చెయ్ ఎత్తుతుంది. దాంతో సుభాష్ ఆపుతాడు. కావ్య పైకి వెళ్ళాక చూసారా మన వంశాన్ని బ్రష్టు పట్టించడానికి వచ్చిందని రుద్రాణి అంటుంది. గదిలోకి వెళ్ళాక నాపై కోపంగా ఉందా అని రాజ్ ని కావ్య అడుగుతుంది. లేదు మన నిస్సహాయతపై కోపంగా ఉంది. నందగోపాల్ మీద కోపంగా ఉంది అంటూ కావ్యతో పాజిటివ్ గా మాట్లాడతాడు రాజ్. నీ భర్తగా ఇక నువ్వు బాధపడకుండా చూసుకుంటానని రాజ్ అనగానే కావ్య ఎమోషనల్ అవుతూ రాజ్ ని హగ్ చేసుకుంటుంది. మరొకవైపు నిన్ను ఆ అనామిక అలా అంది అంటూ అప్పుతో చెప్తూ కళ్యాణ్ బాధపడతాడు. భోజనం చెయ్యడు. దాంతో నేను కూడా భోజనం చెయ్యను. రేపు వెళ్ళాలి గుర్తుంచుకోమని అప్పు అనగానే కళ్యాణ్ భోజనం చేస్తాడు.

కావ్య తనతో అలా మాట్లాడినందుకు సుభాష్ బాధపడుతుంటాడు. అప్పుడే ప్రకాష్ వచ్చి నాకు అవమానం జరిగితే.. నువ్వు ఉన్నావ్ అనుకున్న కానీ ఈ రోజు నీక్కూడా జరిగిందని ప్రకాష్ అంటాడు. అదంతా కావ్య వింటుంది. తరువాయి భాగంలో అందరూ భోజనం చేస్తుంటారు. అపర్ణ, సుభాష్ లు రాకపోవడంతో ఎలా వస్తారు.. అంత అవమానం జరిగినా తర్వాత అని రుద్రాణి అంటుంది. నందగోపాల్ ని ఎవరు షూట్ చేశారు. వాడు బ్రతికి ఉంటే ఎవరికి నష్టం దీని వెనకాల ఎవరో ఉన్నారని రాజ్ తో కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.