English | Telugu

ఆడపిల్లకు జన్మనిచ్చిన ప్రియాంక-మధు

జీ తెలుగులో ప్రసారమైన ‘మంగమ్మగారి మనవరాలు’ సీరియల్‌లో సాకేత్‌గా మధుబాబు బాగా పాపులర్. ఆ తర్వాత ‘అభిషేకం’, ‘అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు’, ‘రెండు రెళ్లు ఆరు’… ఇలా వరుస సీరియల్స్‌తో బుల్లితెర పై బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. వరుస సీరియల్స్ తో స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ కి పరిచయమైన మధుబాబు బాగా ఫేమస్ అయ్యాడు.

బుల్లితెర నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి మధుబాబు మరో నటి ప్రియాంక నాయుడుని వివాహం చేసుకున్నాడు. ఆమె 'వదినమ్మ' సీరియల్‌లో సిరి క్యారెక్టర్ లో నటించింది. వీళ్లది ప్రేమ వివాహం. పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నారు. ‘వదినమ్మ’ సీరియల్ తర్వాత ప్రియాంక ‘దీపారాధన’ సీరియల్ లో నటించి మెప్పించింది. ఇక 2021 జనవరిలో ప్రియాంక , మధుబాబును పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అలాంటి ప్రియాంక- మధు ఇప్పుడు తల్లితండ్రులయ్యారు. వాళ్లకు పండంటి ఆడపిల్ల పుట్టింది. ఆ విషయాన్ని ప్రియాంక-మధు అనే తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫాన్స్ కి ఈ విషయాన్నీ షేర్ చేసారు. వదినమ్మ తర్వాత ప్రియాంక సీరియల్స్ కు బ్రేక్ ఇచ్చింది అలాగే మధుబాబు కూడా నటనకు దూరమయ్యాడు.

కానీ సోషల్ మీడియా ద్వారా ఈ లవ్ పెయిర్ అభిమానులతో టచ్ లోనే ఉంటుంది. తమ అప్ డేట్స్ ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంటూ ఉన్నారు ఈ జంట. ప్రియాంక నాయుడు “టూలెట్” అనే మూవీలో హీరోయిన్ గా నటించింది కానీ ఆ మూవీ గురించి పెద్దగా ఎవరికీ తెలీదు. తరువాత “అనగనగా ఒక దుర్గ” అనే మూవీలో కూడా హీరోయిన్ గా నటించింది కానీ మంచి బ్రేక్ రాకపోయేసరికి మళ్ళీ బుల్లితెర మీద సీరియల్స్ లో నటించడం స్టార్ట్ చేసింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.