వైభవంగా ‘తెలుగువన్’ 24వ వార్షికోత్సవం!
తెలుగు ప్రజలకు నిరంతరాయంగా వినోదాన్ని, సమాచారాన్ని నిర్విరామంగా అందిస్తూ, తెలుగు ప్రజల ఆదరణను, ఆశీస్సులను అందుకుంటోంది తెలుగువన్. ఎంట్రప్రిన్యుర్ క్వాలిటీతోపాటు సృజనాత్మకత కూడా పుష్కలంగా వున్న కంఠంనేని రవిశంకర్ పాతికేళ్ళ క్రితం ‘ఆబ్జెక్ట్ వన్’ సంస్థని స్థాపించారు. ఆబ్జెక్ట్ వన్ సంస్థని స్థాపించిన ఒక ఏడాది తర్వాత తెలుగు ప్రజల ముందుకు వచ్చింది ‘తెలుగువన్’. వెబ్సైట్, యూట్యూబ్ ఛానల్ రూపాల్లో తెలుగు ప్రజల ముందుకు వచ్చిన ‘తెలుగువన్’ భారతదేశంలో యూట్యూబ్తో కలసి ప్రయాణాన్ని ప్రారంభించిన తొలి సంస్థల్లో ఒకటిగా నిలిచింది. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద డిజిటల్ మీడియా నెట్వర్క్గా అభివృద్ధి చెందిన ‘తెలుగువన్’ మొత్తం 350 యూట్యూబ్ ఛానళ్ళతో అగ్రస్థానంలో దూసుకువెళ్తోంది.