Read more!

English | Telugu

వాళ్లకు దక్కనిది..నాకక్కర్లేదు

భారత ప్రభుత్వం ఇచ్చే పద్మ అవార్డులను జీవితంలో ఒక్కసారైనా దక్కించుకోవాలని కలలు కనేవారు దేశంలో కొకొల్లలు. తమ పేరు ముందు పద్మశ్రీ అని పేరు వేయించుకోవాలని తహతహలాడుతారు. కాని ఒకాయన మాత్రం తనకు ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇస్తే తీసుకోనని చెప్పేశారు.


టాలీవుడ్‌లో రైటర్ నుంచి యాక్టర్‌గా టర్న్ అయిన వారు చాలామందే ఉన్నారు. వారిలో తనికెళ్ల భరణి ఒకరు. రచయితగా..కమెడియన్‌గా..క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా..విలన్‌గా..దర్శకుడిగా ఇలా తనలో ఉన్న టాలెంట్‌ని ప్రేక్షకులకు చూపించారు భరణి. చాలా సింపుల్‌గా..అందరిని నవ్వుతూ..నవ్విస్తూ ఉండే తనికెళ్ల భరణి అంటే అందరికి ఇష్టమే. వివాదాలకు వీలైనంత దూరంలో ఉండే ఆయన తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్వీఆర్, సావిత్రి, సూర్యకాంతం వంటి మహానటులను ప్రభుత్వం పట్టించుకోలేదని..వారి ప్రతిభకు ఖచ్చితంగా పద్మ అవార్డులు వరించాలని..అలాంటి వారికి దక్కని పద్మశ్రీ తనకు వద్దని..ఒకవేళ ఇచ్చినా తాను తీసుకోనని చెప్పేశారు. ఆయన వ్యాఖ్యలు చిత్రపరిశ్రమలోని వారిని ఆలోచింపచేస్తున్నాయి.