Read more!

English | Telugu

రేణు మనసును దోచిన చిలుక!

రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె చాలా బోల్డ్ అండ్ బ్యూటిఫుల్..  "జానీ" మూవీ తర్వాత ఆమె సిల్వర్ స్క్రీన్ పై పెద్దగా కనిపించలేదు. తన కొడుకు, కూతురితో చాలా హ్యాపీగా ఉంటోంది రేణు దేశాయ్. అలాంటి రేణు సోషల్ మీడియాలో తన అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఇకపోతే  రేణుకి పక్షులంటే ఎంతో ఇష్టం. రీసెంట్ గా ఆమె ఒక రెస్టారెంట్ కి వెళ్ళింది. అక్కడ జరిగింది మొత్తాన్ని వీడియో తీసి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. రంగురంగుల చిలక ఒకటి రేణు దేశాయ్ ప్లేట్ లో ఉన్న బాదం పప్పుల్ని తింటూ కనిపించింది. అది అలా తింటుంటే రేణు ముఖంలో ఎంతో సంతోషంతో వెలిగిపోయింది. " ఈ క్యూట్ చిలుక  మీ ప్లేట్ లోంచి కూడా  ఇలాగే బాదంపప్పులు దొంగతనం చేస్తే చూడాలని ఉంటే గనక వెంటనే మీరు మైరు కేఫ్ కి వచ్చేయండి..నా మనసును దోచుకుంది ఈ చిలుక" అని చెప్పింది.

అలాగే మరో వీడియోలో మలయాళంలో దుల్కర్ సల్మాన్ నటించిన "టైగర్ నాగేశ్వరావు" మూవీ ఫస్ట్ లుక్ మే 24 న రిలీజ్ కాబోతోంది..అంటూ లేటెస్ట్ అప్ డేట్ ని పోస్ట్ చేసింది. చాలా ఏళ్ళ తర్వాత రేణు సిల్వర్ స్క్రీన్ మీద కనిపించబోతోంది. టైగర్ నాగేశ్వరరావు మూవీలో ఆమె  హేమలత లవణం పాత్రలో నటిస్తోంది.   ఈ మూవీతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేస్తూ  రీఎంట్రీ ఇవ్వడంతో ఫాన్స్ కూడా  హ్యాపీగా ఉన్నారు. ఈ మూవీలో రవితేజ హీరోగా నటిస్తున్నాడు. ఆయన కెరీర్ లో ఫస్ట్ టైం పీరియాడికల్ స్టోరీలో కనిపించి అలరించబోతున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ మూవీ రాబోతోంది.