Read more!

English | Telugu

రజినీకాంత్ చివరి సినిమా అదే: దుమారం రేపుతున్న డైరెక్టర్ కామెంట్స్

 

సూపర్‌స్టార్ రజినీకాంత్ త్వరలో 'జైలర్‌'గా మన ముందుకు రాబోతున్నారు. నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టులో విడుదలవుతోంది. ప్రస్తుతం రజినీ తన పెద్ద కుమార్తె ఐశ్వర్య డైరెక్షన్‌లో 'లాల్ సలాం' అనే మూవీ చేస్తున్నారు. ఇందులో క్రికెట్ లెజెండ్ కపిల్‌దేవ్ కనిపించనుండటం ఒక విశేషం.

కాగా ఇప్పుడు తమిళ దర్శకుడు మిస్కిన్ చేసిన వ్యాఖ్యలు ఆన్‌లైన్‌లో దుమారం రేపుతున్నాయి. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో రజినీ ఒక సినిమా చేయబోతున్నారనీ, అదే ఆయనకు చివరి సినిమా కావచ్చనీ ఒక ఇంటర్వ్యూలో మిస్కిన్ చెప్పాడు. లోకేశ్‌ను స్వయంగా పిలిపించుకొని సినిమా చేద్దామని రజినీ అడిగారని కూడా మిస్కిన్ ఆ ఇంటర్వ్యూలో తెలిపాడు. 

ఆయన కామెంట్స్ ఇప్పుడు కోలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలామంది మిస్కిన్ కామెంట్స్‌ను ఖండిస్తున్నారు. ఆ సినిమా లోకేశ్‌కు చివరి సినిమా వుతుందేమో కానీ రజినీకి కాదని కొంతమంది ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. గతంలోనూ కొన్నిసార్లు ఇలాంటి వ్యాఖ్యలే రజినీ గురించి వచ్చాయనీ, అవన్నీ తప్పని తేలాయనీ వారు గుర్తు చేస్తున్నారు. ప్రధానంగ 'బాబా' మూవీ తర్వాత రజినీ సినిమాల నుంచి రిటైర్ అయ్యారంటూ ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లే అప్పట్లో ఆయన సుదీర్ఘ విరామం తీసుకున్నారు. తర్వాత 'చంద్రముఖి' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకుల్ని అలరించారు.

ఐశ్వర్య దర్శకత్వంలో రజినీ చేస్తున్న 'లాల్ సలాం' సినిమా.. ఆయనకు 170వది. దాని తర్వాత ఆయన లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో నటించే అవకాశాలున్నాయి.