Read more!

English | Telugu

లేడీ డైరెక్టర్ తో రాజ్ తరుణ్ రోమాంటిక్ ఎంటర్ టైనర్!

"ఈడోరకం ఆడోరకం" సినిమా విడుదలైన తర్వాత హీరో రాజ్ తరుణ్ మీద బోలెడన్ని రూమర్స్ వచ్చాయి. ఓ నిర్మాణ సంస్థతో డీల్ కుదుర్చున మూడు ప్రొజెక్టులు కోల్పోయాడట, వాటిలో వాస్తవమెంతో తెలియదు గానీ.. తాజాగా మనోడు ఓ రోమాంటిక్ ఎంటర్ టైనర్ కి సైన్ చేసినట్లు తెలుస్తోంది. మారుతి కథ అందించనున్న ఈ చిత్రం ద్వారా "సంజనా రెడ్డి" అనే యువ ప్రతిభాశాలి దర్శకురాలిగా పరిచయం కానుంది. రాంగోపాల్ వర్మ వద్ద దర్శకత్వ శాఖలో శిష్యరికం చేసిన సంజనా రెడ్డి అంతకుమునుపు మీడియాలో రిపోర్టర్ గా పనిచేయడం విశేషం.  ఇకపోతే.. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్ కీలకపాత్ర పోషించనున్నాడని సమాచారం అందుతోంది. ప్రస్తుతం హీరోయిన్ కోసం వెతుకుతున్నారట. ఇది కాకుండా రాజ్ తరుణ్ మరో రెండు సినిమాలు సైన్ చేసినట్లు తెలుస్తోంది!