English | Telugu

రాంగోపాల్‌ వర్మపై కుర్ర హీరో సెటైర్లు

రాంగోపాల్‌ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న రాజ్‌ తరుణ్ ..నిన్న అర్ధరాత్రి దాటాక సెన్సేషనల్‌ కామెంట్లతో ట్విట్టర్ని వేడెక్కించాడు ‌. ''వర్మతో సినిమా చేయబోతున్నా. అతను జస్ట్‌ ఓకే ఓకే డైరెక్టర్‌. అతడికి నేను పెట్టిన పెట్‌ నేమ్‌ అప్పారావు''.. ''నేను డైరెక్టర్‌ అయి ఉంటే రంగీలా, శివ కంటే చాలా బెటర్‌ సినిమాలు చేసి ఉండేవాణ్నని నిజాయితీగా ఫీలవుతున్నా''.. ''ఆర్జీవీ జస్ట్‌ 'ఓకే' డైరెక్టర్‌ అయినప్పటికీ అతడితో సినిమా ఎందుకు చేస్తున్నానంటే.. నేనతడి తప్పుల్ని సరిదిద్దగలననే''.. ఇలా వరుసగా మూడు ట్వీట్లు గుప్పించాడు రాజ్‌ తరుణ్. కొసమెరుపు ఏంటంటే.. ఈ ట్వీట్లపై వర్మ కూడా స్పందించాడు. ‘‘రాజ్ తరుణ్ నటుడిగా కంటే దర్శకుడిగా నాకన్నా పూరి జగన్నాథ్ - వి.వి.వినాయక్- రాజమౌళి తదితరులకన్నా సామర్థ్యం ఉన్నవాడని నిజంగా నమ్ముతున్నా’’ అన్నాడు వర్మ.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.