English | Telugu

శ్రీలంకలో రామ్ చరణ్, సంపత్ నంది రచ్చ

శ్రీలంకలో రామ్ చరణ్, సంపత్ నంది "రచ్చ" సినిమా షుటింగ్ జరుగుతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే మెగా సూపర్ గుడ్ పతాకంపై, యువ హీరో రామ్ చరణ్ తేజ హీరోగా, మిల్కీవైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, "ఏమైంది ఈ వేళ" సినిమా ఫేం సంపత్ నంది దర్శకత్వంలో, యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమ" రచ్చ". రామ్ చరణ్ "రచ్చ" సినిమా జూన్ మొదటి తేదీన హైదరాబాద్ లో లాంఛనంగా ముహూర్తం ప్రారంభించుకుంటుంది.

ఆ తర్వాత జూన్ మూడవ తేదీ నుండి శ్రీలంక దేశంలో షుటింగ్ జరుపుకుంటుంది. శ్రీలంకలో రామ్ చరణ్ "రచ్చ" సినిమాకి షూటింగ్ కోసం అనువైన ప్రదేశాలను ఈ సినిమా యూనిట్ ఇప్పటికే పరిశీలించింది. రామ్ చరణ్ "రచ్చ" సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. రామ్ చరణ్ "రచ్చ" సినిమా పూర్తిగా కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్ మూవీ అని ఈ సినిమా యూనిట్ చెపుతోంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.