English | Telugu

పూరీ కొడుక్కి ఆ మోజు ఎక్కువే!

సూప‌ర్ స్పీడ్‌తో సినిమాల‌ను తీయ‌డం ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ స్టైల్‌. ఆయ‌న వేగాన్నే ఎంతో కొంత అందిపుచ్చుకున్నాడు పూరీ త‌న‌యుడు ఆకాష్ పూరీ. 'చిరుత'తో బాల‌న‌టుడుగా ఎంట్రీ ఇచ్చిన ఆకాష్‌.. ఆ త‌రువాత 'బుజ్జిగాడు', 'ఏక్ నిరంజ‌న్'‌, 'బిజినెస్‌మేన్'‌, 'గ‌బ్బ‌ర్‌సింగ్' త‌దిత‌ర‌ చిత్రాల‌లో చ‌కచ‌కా న‌టించి సంద‌డి చేశాడు. ఇక 'ధోని' వంటి చిత్రాల్లో అయితే ఫుల్‌ఫ్లెడ్జెడ్ రోల్స్‌ ప్లే చేశాడు కూడా. తాజాగా.. మ‌రో అడుగు ముందుకు వేసి టీనేజ్ స్టార్ గా మారాడు. 'ఆంధ్రా పోరి' సినిమా కోసం అలా నూనుగు మీసాల‌ హీరో వేష‌మేసాడు. ఈ శుక్ర‌వారం ఆడియ‌న్స్ ముందుకొచ్చిన ఈ సినిమా మంచి టాక్‌నే మూట‌గ‌ట్టుకుంది. ఇదిలా ఉంటే.. ఆకాష్ పూరీ ఈ సినిమా కోసం చేస్తున్న ప్ర‌మోష‌న్స్‌లో.. ఓ విష‌యం చూప‌రుల దృష్టిని ఇట్టే ఆక‌ట్టేస్తోంది. అదేమిటంటే.. సెల్ఫీల‌తో తెగ సంద‌డి చేయ‌డం. త‌న హీరోయిన్‌తోనూ, అభిమానుల‌తోనూ.. ఇలా సెల్ఫీల మీద సెల్ఫీలు దిగి ఓ రేంజ్‌లో త‌న మోజును చాటుకుంటున్నాడు పూరీ త‌న‌యుడు. అదీ సంగ‌తి!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.