Read more!

English | Telugu

పోయిన చోటే వెతుకుతున్న దర్శకుడు...!

"స్వామి రారా" చిత్రంతో అప్పటికే అటకెక్కిపోతుందనుకొన్న యువ కథానాయకుడు నిఖిల్ కెరీర్ ను కష్టాల బారి నుండి తప్పించడమే కాదు.. తెలుగు సినిమాకు "క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్" అనే కొత్త జోనర్ ను కూడా పరిచయం చేశాడు సుధీర్ వర్మ. ఆ సినిమా సక్సెస్ అనంతరం నాగచైతన్య హీరోగా "దోచేయ్" అనే సినిమాను తెరకెక్కించే అవకాశాన్ని సొంతం చేసుకొన్న సుధీర్, ఆ సినిమాతో సక్సెస్ కొట్టలేక ఢీలా పడ్డాడు. "దోచేయ్" రిజల్ట్ పుణ్యమా అని రవితేజతో తెరకెక్కించాల్సిన సినిమా ఛాన్స్ కూడా దాదాపుగా పోగొట్టుకొన్నాడు. దాంతో.. రవితేజ కోసం వెయిట్ చేసే బదులు, తన స్నేహితుడు నిఖిల్ తోనే మరో సినిమా చేసి డైరెక్టర్ గా తన స్టామినాను ప్రూవ్ చేసుకోవాలనుకొంటున్నాడు సుధీర్ వర్మ. ఇప్పటికే స్టోరీ రెడీ చేసుకొని నిఖిల్ కు వినిపించాడని, కథ నచ్చడంతో నిఖిల్ వెంటనే ఒకే చెప్పేశాడని సమాచారం. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమా సెట్స్ కు వెళ్ళే అవకాశముంది.