English | Telugu

నాగార్జున‌కు న‌చ్చ‌లేదు!

మ‌నం త‌ర‌వాత నాగార్జున సినిమాఏదీ రాలేదు. సోగ్గాడే చిన్ని నాయినా ఎప్పుడో మొద‌లైనా, ఆ సినిమా ఇప్ప‌టికీ ఓ కొలిక్కి రాలేదు. ప్ర‌స్తుతం నాగ్ కార్తితో సినిమాత‌ప్ప మ‌రో ప్రాజెక్టులూ ఒప్పుకోలేదు. పెద్ద‌గా షూటింగుల హ‌డావుడీ లేవు. సోగ్గాడే చిన్ని నాయిన షూటింగ్‌కి నిర‌వ‌ధికంగా బ్రేక్ ఇచ్చేశాడు నాగ్‌. అయితే ఏం జ‌రుగుతున్న‌ట్టు..?? సోగ్గాడేని ఎందుకు ప‌క్క‌న పెట్టేసిన‌ట్టు? అనే అనుమానాలు అటు నాగ్ అభిమానుల్లోనూ, ఇటు టాలీవుడ్ వ‌ర్గాల్లోనూ వ్య‌క్తం అవుతున్నాయి.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. `సోగ్గాడే చిన్ని నాయినా` సినిమా ఆగిపోయింద‌ని టాక్‌. ఈ సినిమా ర‌షెస్ చూసిన నాగ్‌... పూర్తి అసంతృప్తితో ఉన్నాడ‌ట‌. క‌థ అనుకొన్న‌ది అనుకొన్న‌ట్టు రాలేద‌ని.. ఫీలౌతున్నాడ‌ట‌. ద‌ర్శ‌కుడు చెప్పిన లైన్ బాగానే ఉన్నా, స‌రిగా టేక‌ప్ చేయ‌లేక‌పోయాడని, సీన్లు స‌రిగా రాలేద‌ని నాగ్‌ భావిస్తున్నాడ‌ట‌. అందుకే అర్థాంత‌రంగా ఈ సినిమాని ఆపేశాడ‌ని తెలుస్తోంది. తీసిన సన్నివేశాల్లో చాలామ‌ట్టుకు రీషూట్ చేయాల‌ని చూస్తున్నాడు నాగ్‌. అందుకే ఆయా స‌న్నివేశాల్ని మ‌ళ్లీ తిర‌గ‌రాయిస్తున్నాడ‌ట‌. ఈ సీన్లు సంతృప్తిక‌రంగా వ‌స్తే షూటింగ్ చేద్దామ‌ని, లేదంటే సినిమానే ఆపేద్దామ‌ని ద‌ర్శ‌కుడు క‌ల్యాణ్‌కి వార్నింగ్ ఇచ్చాడ‌ట నాగ్‌. దాంతో క‌ల్యాణ్ హ‌డావుడిగా.. సీన్లు మ‌ళ్లీ రాసే ప‌నిలో ప‌డ్డాడ‌ట‌. మ‌రి క‌ల్యాణ్ ఈ కింగ్‌ని ఎప్పుడు ఒప్పిస్తాడో, ఎప్పుడు ఈ సినిమాని మ‌ళ్లీ ప‌ట్టాలెక్కిస్తాడో అనేది అనుమానంగా మారింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.