English | Telugu

ఆ ఇర‌వై నిమిషాలూ.. బ్ర‌హ్మీ ఇర‌గ‌దీశాడ‌ట‌!

నాగ‌చైత‌న్య‌, సుధీర్ వ‌ర్మ‌ల దోచేయ్ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. శుక్ర‌వారం ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకురాబోతోంది. ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల్లో ఈ సినిమాపై మంచి అంచ‌నాలే ఉన్నాయి. త‌క్క‌వ బ‌డ్జెట్‌లో తీసినా విజువ‌ల్స్ గ్రాండ్ గా ఉన్నాయ‌ట‌. స్వామి రారా త‌ర‌హాలోనే ఓ క్లీన్ అండ్ ఇంట్ర‌స్టింగ్ మూవీగా ఈ సినిమాని మ‌లిచాడ‌ట సుధీర్ వ‌ర్మ‌. ఈ సినిమాతో మరో హిట్టు కొట్ట‌డం ఖాయం అంటున్నారంతా. సినిమా అంతా ఒక‌యెత్త‌యితే చివ‌రి 20 నిమిషాలూ మ‌రో ఎత్త‌ట‌. బ్ర‌హ్మానందం ఎంట్రీతో సినిమా పీక్‌కి వెళ్తుంద‌ట‌. ఈ ఎపిసోడ్ మొత్తం బ్ర‌హ్మానందం సింగిల్ హ్యాండ్‌తో న‌డిపించేసిన‌ట్టు స‌మాచారం. రేసుగుర్రంలోని చివ‌రి ప‌ది నిమిషాలూ బ్ర‌హ్మానందం ఆడించేశాడు. సేమ్ టూ సేమ్ ఇక్క‌డా... అదే త‌ర‌హాలో రెచ్చిపోయాడ‌ట‌. బ్ర‌హ్మానందం ఎపిసోడ్ ఈ సినిమాని మ‌రో లెవెల్‌కి తీసుకెళ్లిందని చెప్పుకొంటున్నారు. అంటే... ఈ సినిమాలో బ్ర‌హ్మానందం డామినేష‌న్ కనిపిస్తుంద‌న్న‌మాట‌. సినిమా అంతా చైతూ క‌ష్ట‌ప‌డితే.. చివ‌ర్లో వ‌చ్చి క్రెడిట్ దోచేశాడు బ్ర‌హ్మానందం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.