English | Telugu

ఛార్మికి ఇది కూడా పాయె...

మ‌ధ్య మ‌ధ్య‌లో ఐటెమ్ సాంగులు చేసినా - లేడీ ఓరియెంటెడ్ పాత్ర‌ల‌పైనే దృష్టి పెట్టింది ఛార్మి. పూరి తీసిన జ్యోతిల‌క్ష్మితో త‌న రేంజు పెరుగుతుంద‌ని ఆశ‌ప‌డింది. ఆ సినిమాకి పైసా పారితోషికం తీసుకోకుండా, సినిమాలో వాటా కోసం న‌టించింది. అటు పారితోషికం రాలేదు, ఇటు లాభాలూ దక్క‌లేదు. దాంతో నీర‌స‌ప‌డిపోయిన ఛార్మి - మంత్ర 2పై ఆశ‌లు పెట్టుకొంది.

మంత్ర సినిమా ఛార్మి కెరీర్‌లో ఓ మైలు రాయి. ఆ సినిమాతో తొలి నంది అవార్డు కూడా అందుకొంది. మ‌ళ్లీ త‌న‌కు పూర్వ వైభ‌వం తెస్తుంద‌నుకొన్న మంత్ర 2 శుక్ర‌వారం విడుద‌లై... దారుణ ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకొంది. ఈ సినిమాలో విష‌యం లేద‌ని విమ‌ర్శ‌కులు తేల్చేశారు. అంతేనా.. అంటే న‌టిగా ఛార్మి కి మైన‌స్ మార్కులు కూడా వేశారు. ఛార్మి కెరీర్లో ఇంత పూర్ గా న‌టించిన సినిమా ఏదీ లేద‌ని ఏకిపడేశారు. దాంతో ఛార్మి ఆఖ‌రి ఆశ కూడా అడియాశ అయిపోయింది.

ఇప్పుడు ఛార్మి చేతిలో సినిమాలేం లేవు. పోనీ ఇది వ‌ర‌క‌టిలా ఐటెమ్ పాట‌లైనా చేస్తుంద‌నుకొంటే `నేను ఐటెమ్ పాట‌లు చేయ‌నుగాక చేయ‌ను` అంటూ ఈమ‌ధ్య ఓ భారీ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇప్పుడు మాత్రం ప్ర‌త్యేక గీతాలొస్తే వ‌దులుకోదేమో. ఎందుకంటే ఏదోలా గెటిన్ అయిపోవాలిగా. ఛార్మింగ్ ఛార్మికి ఛార్జింగ్ ఇచ్చేది ఇప్పుడు ఐటెమ్ గీతాలొక్క‌టే.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.