English | Telugu
హీరోగా లోకేష్ కనగరాజ్.. ఆ ముగ్గురు హీరోల పరిస్థితి ఏంటి?
Updated : May 13, 2025
ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో వంటి వరుస విజయాలతో సౌత్ సినీ ప్రేమికుల్లో తన కంటు ఒక బ్రాండ్ ని సృషించుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj)ప్రస్తుతం రజనీకాంత్(Rajinikanth)నాగార్జున(Nagarjuna)తో చేస్తున్న 'కూలీ'(Coolie)మూవీతో బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా స్థాయిలో భారీ మల్టిస్టారర్ గా తెరకెక్కుతున్న కూలీ పై లోకేష్, రజనీ, నాగ్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. అగస్ట్ 14 న విడుదల కాబోతుండటంతో శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది.
ఇక ఈ మూవీ తర్వాత 'లోకేష్ కనగరాజ్' హీరోగా పరిచయం కాబోతున్నాడు. స్టార్ హీరో 'ధనుష్'(Dhanush)తో కెప్టెన్ మిల్లర్ ని తెరకెక్కించిన 'అరుణ్ మాతేశ్వర్'(Arun Matheswar)ఆ మూవీకి దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ కి వెళ్లనుండగా హీరోగా లోకేష్ సిల్వర్ స్క్రీన్ పై ఎలా చేస్తాడనే ఆసక్తి అందరిలో ఉంది. కెప్టెన్ మిల్లర్ బ్రిటిష్ కాలంలో జరిగే రా అండ్ రగఢ్ స్టోరీగా తెరకెక్కింది. ధనుష్ క్యారక్టర్ చాలా డిఫరెంట్ గా, ప్రేక్షకులు ఏ మాత్రం గెస్ చెయ్యని విధంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో లోకేష్ ని అరుణ్ మాతేశ్వర్ ఎలాంటి క్యారక్టర్ లో ప్రెజెంట్ చెయ్యబోతున్నాడు, సబ్జెక్టు ఎలా ఉండబోతోందనే క్యూరియాసిటీ ఏర్పడింది.
ఇక లోకేష్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాల లిస్ట్ లో ఖైదీ పార్ట్ 2 , విక్రమ్ పార్ట్ 2 ఉన్నాయి. ఈ రెండు చిత్రాలకి సంబంధించిన మొదటి భాగాలు ఎంతగా ఘన విజయాన్ని అందుకున్నాయో తెలిసిందే పైగా విక్రమ్ 2 లో సూర్య చేసిన రోలెక్స్ క్యారక్టర్ కూడా సినిమాగా ఉండబోతుంది. దీంతో ఆ మూడు చిత్రాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయా అని అభిమానులు ఎదురు చూస్తు వస్తున్నారు. ఈ క్రమంలో లోకేష్ కూలీ తర్వాత హీరోగా చేస్తున్నాడు. ఆ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి ఎంత లేదన్న ఆరునెలల సమయం పడుతుంది. దీంతో మరి ఆ మూడు చిత్రాలని లోకేష్ ఎప్పుడు తెరకెక్కిస్తాడనే చర్చ అభిమానుల్లో జరుగుతుంది. హీరోగా చేసిన సినిమా హిట్ అయితే మరో సినిమా చేసే అవకాశం ఉంటుందని, దాంతో ఆ మూడు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి మరింత సమయం పట్టవచ్చనే అభిప్రాయం కూడా వాళ్ళల్లో వ్యక్తమవుతుంది.
