Read more!

English | Telugu

బెల్లంకొండ ప్రపంచ రికార్డు.. 'కేజీఎఫ్'ను దాటేశాడు!

ఒక్కోసారి బాక్సాఫీస్ దగ్గర కుర్ర హీరోల సినిమాలు అద్భుతాలు చేస్తుంటాయి. అయితే యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు మాత్రం యూట్యూబ్ లో ప్రపంచ రికార్డులు సృష్టిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ లో అత్యధిక మంది వీక్షించిన సినిమా బెల్లంకొండ నటించిన చిత్రం కావడం విశేషం.

బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'జయ జానకి నాయక'(2017). ఈ సినిమాని హిందీలోకి డబ్ చేసి 2019 లో 'పెన్ మూవీస్' యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేయగా ఇప్పటిదాకా ఏకంగా 709 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీంతో యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ లో సాధించిన చిత్రంగా 'జయ జానకి నాయక' రికార్డు సృష్టించింది. 702 మిలియన్ వ్యూస్ తో ఆ తర్వాతి స్థానంలో 'కేజీఎఫ్' నిలిచింది. బెల్లంకొండ నటించిన మరో సినిమా 'సీత' హిందీ డబ్బింగ్ వెర్షన్ కి కూడా 588 మిలియన్ వ్యూస్ రావడం విశేషం.

యూట్యూబ్ లో బెల్లంకొండ హిందీ డబ్బింగ్ సినిమాలకు ఆ స్థాయి రెస్పాన్స్ రావడం చూసే ఆయనతో హిందీ సినిమా చేయాలని పెన్ మూవీస్ భావించినట్లుంది. 'ఛత్రపతి' హిందీ రీమేక్ తో త్వరలో బెల్లంకొండ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మే 12న విడుదల కానుంది. మరి యూట్యూబ్ ద్వారా నార్త్ ఆడియన్స్ కి దగ్గరైన బెల్లంకొండ.. థియేటర్లలోనూ ఆదరణ పొందుతాడేమో చూడాలి.