English | Telugu

జెండా ఎత్తేసిన హీరోయిన్ ఎవ‌రు??

ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్ల కేసు తీగ లాగితే డొంక క‌దులుతోంది. ఎర్ర‌చందనం స్మగ్ల‌ర్ల‌కీ.. ఓ టాలీవుడ్ నిర్మాత‌కూ సంబంధం ఉంద‌ని తాజాగా ఎంక్వైరీలో తేలింది. స్మ‌గ్ల‌ర్లు సినిమా ప‌రిశ్ర‌మ‌లో పెట్టుబ‌డి పెట్టార‌ని.. ఓ హీరోయిన్‌కి భారీగా డ‌బ్బులు ట్రాన్స్‌ఫ‌ర్ చేశార‌ని పోలీసులు నిర్దారించారు. ఆ హీరోయిన్ పంజాబీ ప‌డుచ‌ట‌. ప్ర‌తి నెలా ఆ హీరోయిన్ ఖాతాలో భారీగా డ‌బ్బులు జ‌మ‌వుతూ వ‌చ్చాయ‌ట‌. ఈ విష‌యం తెలుసుకొన్న పోలీసులు ఆమె బ్యాంకు ఖాతాల‌ను స్థంభింప‌చేశారు. అదుపులో తీసుకొని ప్ర‌శ్నించాల‌నుకొంటున్న స‌మ‌యంలోనే ఆ హీరోయిన్ బిజానా ఎత్తేసి అండ‌ర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోయింద‌ని టాక్‌. మ‌రి ఆ హీరోయిన్ ఎవ‌రు?? అనే విష‌యంపై ప‌రిశ్ర‌మ‌లో ఆసక్తిక‌ర‌మైన చ‌ర్చ న‌డుస్తోంది. అగ్ర హీరోల‌తో జ‌ట్టు క‌ట్టి... ఇప్పుడో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్న పంజాబీ భామే.. ఆ హీరోయిన్ అని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రి నిజానిజాలేమిటో కాల‌మే చెప్పాలి.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.