English | Telugu

దేవిశ్రీప్రసాద్ తండ్రి రచయిత సత్యమూర్తి ఇకలేరు

ప్రముఖ సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ తండ్రి, ప్రముఖ సినీ రచయిత సత్యమూర్తి గుండెపోటుతో ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. సత్యమూర్తి సుమారు 90 చిత్రాలకు రచయితగా పనిచేసి, తెలుగు సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. 'దేవత', 'ఛాలెంజ్‌', 'భలే దొంగ', 'అభిలాష', తదితర చిత్రాలు సత్యమూర్తికి పేరు ప్రఖ్యాతులు అందించాయి. సినీ రంగంలో రచయితగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న సత్యమూర్తితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వ్యక్తిగతంగా తమకు సత్యమూర్తి మరణం తీరని లోటు అనీ, తెలుగు సినీ పరిశ్రమ ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయిందనీ పలువురు సినీ ప్రముఖులు వ్యాఖ్యానించారు. ఇకపోతే సత్యమూర్తి అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం చెన్నైలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సత్యమూర్తి గారి మృతికి తెలుగువన్ ప్రగాఢ సంతాపం తెలియజేస్తోంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.