English | Telugu

బాలయ్య న్యూ ట్రెండ్.. త్రీడీ సెట్ లో 'లయన్' ఆడియో

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లయన్'. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ‘లయన్' ఆడియోను ఏప్రిల్ 9న పలువురు సినీ మరియు రాజకీయ ప్రముఖుల సమక్షంలో అత్యంత భారీ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్ర నిర్మాత రుద్రపాటి రమణారావు సన్నాహాలు చేసుకుంటున్నారు. అలాగే ఈ సినిమా ఆడియో కోసం ప్రత్యేకంగా మొదటిసారి త్రీడీ సెట్‌ను వేయిస్తున్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య సీబీఐ ఆఫీసర్‌గాను, సామాన్యుడిగాను ద్విపాత్రాభినయం చేస్తున్నారు. బాలయ్య సరసన త్రిష, రాధికాఆఫ్టే హీరోయిన్లుగా నటిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.