English | Telugu

సైజ్ జీరో.. రాజ‌మౌళి చేతుల్లో

రాఘ‌వేంద్ర‌రావు త‌న‌యుడు ప్ర‌కాష్ కోవెల‌మూడికి సైజ్ జీరోతో హిట్టుకొట్ట‌డం అత్య‌వ‌స‌రం. ఒక‌ప్పుడు హీరోగా ఓ వెలుగు వెలుగుదామ‌ని భావించి.. తొలి సినిమాతోనే అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యాడు. ఆ త‌ర‌వాత అన‌గ‌న‌గా ఓ ధీరుడు భారీ స్థాయిలో తెర‌కెక్కించి బాక్సాఫీసు ద‌గ్గ‌ర మాత్రం బోల్తా ప‌డ్డాడు. ఈసారి హిట్టు కొట్ట‌క పోతే, ద‌ర్శ‌కుడిగానూ ఫెయిల్యూర్స్ మోయాల్సివ‌స్తుంది.

అందుకే.. సైజ్ జీరో విష‌యంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌న్నీ తీసుకొంటున్నాడు. ఈ సినిమా విష‌యంలో రాజ‌మౌళి హ‌స్తం కూడా ఉంద‌న్న‌ద‌ని లేటెస్ట్ టాక్‌. సినిమా అంతా పూర్తయ్యాక రాజ‌మౌళి చేతిలో పెట్టాడ‌ట ప్ర‌కాష్‌. ఆయ‌న ఈ సినిమా చూసి, ద‌గ్గ‌రుండి ఎడిట్ చేసి పెట్టాడ‌ని.. సినిమాని ఎక్క‌డ లేపాలో అక్క‌డ లేపాడ‌ని, దాంతో రాజ‌మౌళి మార్క్ ఈ సినిమాలో క‌నిపించ‌బోతోంద‌ని టాక్‌.

సెన్సార్‌కి వెళ్లే ముందు కూడా ఫైన‌ల్ కాపీ చూసిన రాజ‌మౌళి ఒక‌ట్రెండు మార్పులు చెప్పాడ‌ని, ఇప్పుడంతా క్లియ‌ర్ అయ్యింద‌ని టాక్‌. రాఘ‌వేంద్ర‌రావు శిష్యుడిగా అరంగేట్రం చేసి, సంచ‌ల‌న ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకొన్న జ‌క్క‌న్న‌.. త‌న గురువు రుణం ఇలా తీర్చుకొంటున్నాడ‌న్న‌మాట‌.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.