English | Telugu

అలనాటి నటిమణి రాజశ్రీ నగలు చోరీ..!

ఎన్టీఆర్, కాంతారావు లాంటి వారి సరసన ఎన్నో సినిమాల్లో రాజకుమారిగా మెప్పించిన నటీమణి రాజశ్రీ. ప్రస్తుతం ప్రశాంతంగా చెన్నైలో విశ్రాంత జీవితం గడుపుతున్న 71 ఏళ్ల రాజశ్రీ నగలు చోరీకి గురయ్యాయి. మంగళవారం, తన కొడుకుతో కలిసి బ్యాంకు లాకర్లో ఉంచిన ఆభరణాలను తీసుకుని వస్తుండగా ఈ చోరీ జరిగింది. కారులో కూర్చుని కొడుకు రాక కోసం చూస్తున్న రాజశ్రీని ఒక వ్యక్తి, కారు దగ్గర డబ్బు నోట్లు పడేసి మీవేనా చూసుకోండి అని అడిగాడట. వాటిని చూడటానికి ఆమె కారు దిగగానే, నగల బ్యాగును అపహరించుకుని దుండగుడు, కొంచెం దూరంలో వెయిట్ చేస్తున్న వ్యక్తితో కలిసి బైక్ పై పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ నగల విలువ 15 లక్షల వరకూ ఉంటుందని సమాచారం. అపహరించిన వ్యక్తి ముఖాన్ని బ్యాంకు దగ్గరున్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. రాజశ్రీ రాజకుమారి పాత్రల్లో చాలా తెలుగు సినిమాల్లో మెప్పించారు. కేవలం తెలుగే కాక, తమిళ మళయాళ సినిమాల్లో కూడా లెక్కలేనన్ని పాత్రలు వేశారామె. మనుషులు మమతలు, మహామంత్రి తిమ్మరుసు, ఆరాధన, దానవీరశూరకర్ణ, అల్లూరి సీతారామరాజు లాంటి అనేక సినిమాల్లో ఆమె తన నటనతో ప్రేక్షకుల్ని అలరించారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.