English | Telugu

బోరున ఏడ్చేసిన కత్రినా.. కారణం అతనేనా?

పాపం కత్రినా ఏం కష్టమొచ్చిందో ఏమో బోరున ఏడ్చేసిందట. కత్రినా ఏంటీ ఏడవడం ఏంటీ.. ఏదో సినిమాలో ఏడ్చింది అనుకుంటున్నారా? నిజంగానే పబ్లిక్ గా ఏడ్చేసిందట. ముబైలోని బాద్రాలో ఉన్న చర్చికి వెళ్లిన కత్రినా అక్కడ మేరీ మాత ముందు విలపించిందట. దీనిని వెంటనే ఓ మీడియా కు సంబంధించిన వ్యక్తి ఫోటోలు తీశాడు.. అయితే ఈ విషయం గమనించిన కత్రినా తన ఫోటోలు బయట పెట్టొద్దని ప్రాధేయపడటంతో అతను ఆ ఫొటోలు పబ్లిష్ చేయలేదు. కానీ వార్త మాత్రం ఆగుతుందా అది ఆనోట ఈ నోట పాకి బీ టౌన్ లో హాట్ టాపిక్ అయింది. అసలు కత్రినా ఎందుకు ఏడ్చింది.. ఒకవేళ బాయ్ ఫ్రెండ్ రణబీర్ విషయంలో ఏడ్చిందా అంటూ పలు రకాల ప్రశ్నలు అప్పుడే మొదలయ్యాయి.

ఎందుకంటే మొదట సల్మాన్ ఖాన్ తో ప్రేమాయణం సాగించిన కత్రినా ఆ తరువాత అతనితో విడిపోయి రణబీర్ కపూర్ తో ప్రేమలో పడింది. దాదాపు మూడేళ్లు పాటు డీప్ లవ్ లో ఉన్న కత్రినా, రణబీర్లు.. ఇదిగో ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు.. అప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అప్పట్లో తెగ వార్తలు వచ్చాయి తప్పా అది జరిగిందీ లేదు. ఇప్పుడు అసలు ఆ ఊసే ఎక్కడా వినిపించడంలేదు. అయితే కత్రినా పెళ్లికి రెడీగా ఉన్నా.. రణబీర్ మాత్రం ఈ విషయాన్ని ఏటూ తెల్చడంలేదని కొంతమంది చెబుతున్నారు. దీంతో ఈ ఫ్రస్ట్రేషన్ లోనే కత్రినా ఏడ్చేసి ఉంటుందని అనుకుంటున్నారు. ఇంతకీ కత్రినా ఎందుకు ఏడ్చిందో కత్రినానే చెప్పాలి..

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.