English | Telugu

పాన్‌ ఇండియా మూవీలో విలన్‌గా నరేష్‌.. హీరో, డైరెక్టర్‌ ఎవరో తెలుసా?

‘ప్రేమ సంకెళ్ళు’ చిత్రంతో హీరోగా పరిచయమైన నరేష్‌.. ‘నాలుగు స్తంభాలాట’తో చిత్రంతో పెద్ద సక్సెస్‌ సాధించారు. ఆ తర్వాత కామెడీ ప్రధానంగా రూపొందిన చాలా సినిమాల్లో నటించి సక్సెస్‌ఫుల్‌ హీరో అనిపించుకున్నారు నరేష్‌. కామెడీ ప్రధానంగా ఉన్న సినిమాలే కాకుండా సెంటిమెంట్‌, ఎమోషనల్‌, యాక్షన్‌ సినిమాల్లో కూడా నటించి ఆల్‌రౌండర్‌ అనిపించుకున్నారు. తన సెకండ్‌ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా సక్సెస్‌ సాధించిన నరేష్‌ తాజాగా నారా రోహిత్‌, శ్రీదేవి జంటగా నటించిన ‘సుందరకాండ’ చిత్రంలో ఒక మంచి క్యారెక్టర్‌ చేశారు. ఈ సినిమా ఆగస్ట్‌ 27న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో ఒక కొత్త విషయాన్ని తెలిపారు నరేష్‌.

‘నేను కామెడీ బాగా చెయ్యగలను అనే పేరు ఆల్రెడీ ఉంది. అలాగే రంగస్థలం చిత్రం నుంచి మంచి ఎమోషనల్‌ క్యారెక్టర్స్‌ కూడా బాగా చెయ్యగలను అనిపించుకున్నాను. నేను చేసే సినిమాల్లో మంచి క్యారెక్టర్స్‌ పడాలని కోరుకుంటాను. నెక్స్‌ట్‌ నేను చేయబోయే సినిమాల్లో మూడు నాలుగు ఎమోషనల్‌ క్యారెక్టర్స్‌ చేస్తున్నాను. అలాగే నాలుగు రసాలను పండిరచే ఒక విచిత్రమైన క్యారెక్టర్‌ కూడా చేస్తున్నాను. అన్నింటినీ మించి ఒక పాన్‌ ఇండియా మూవీలో విలన్‌గా నటించబోతున్నాను. అయితే ఆ సినిమాలో హీరో ఎవరు, డైరెక్టర్‌ ఎవరు అనే విషయాలు ఇప్పుడే నేను చెప్పలేను. ఆ సినిమా మాత్రం చాలా బిగ్‌ రేంజ్‌లో ఉండబోతోంది. వివరాలు త్వరలోనే తెలుస్తాయి’ అన్నారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.