English | Telugu

పాన్‌ ఇండియా మూవీలో విలన్‌గా నరేష్‌.. హీరో, డైరెక్టర్‌ ఎవరో తెలుసా?

‘ప్రేమ సంకెళ్ళు’ చిత్రంతో హీరోగా పరిచయమైన నరేష్‌.. ‘నాలుగు స్తంభాలాట’తో చిత్రంతో పెద్ద సక్సెస్‌ సాధించారు. ఆ తర్వాత కామెడీ ప్రధానంగా రూపొందిన చాలా సినిమాల్లో నటించి సక్సెస్‌ఫుల్‌ హీరో అనిపించుకున్నారు నరేష్‌. కామెడీ ప్రధానంగా ఉన్న సినిమాలే కాకుండా సెంటిమెంట్‌, ఎమోషనల్‌, యాక్షన్‌ సినిమాల్లో కూడా నటించి ఆల్‌రౌండర్‌ అనిపించుకున్నారు. తన సెకండ్‌ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా సక్సెస్‌ సాధించిన నరేష్‌ తాజాగా నారా రోహిత్‌, శ్రీదేవి జంటగా నటించిన ‘సుందరకాండ’ చిత్రంలో ఒక మంచి క్యారెక్టర్‌ చేశారు. ఈ సినిమా ఆగస్ట్‌ 27న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో ఒక కొత్త విషయాన్ని తెలిపారు నరేష్‌.

‘నేను కామెడీ బాగా చెయ్యగలను అనే పేరు ఆల్రెడీ ఉంది. అలాగే రంగస్థలం చిత్రం నుంచి మంచి ఎమోషనల్‌ క్యారెక్టర్స్‌ కూడా బాగా చెయ్యగలను అనిపించుకున్నాను. నేను చేసే సినిమాల్లో మంచి క్యారెక్టర్స్‌ పడాలని కోరుకుంటాను. నెక్స్‌ట్‌ నేను చేయబోయే సినిమాల్లో మూడు నాలుగు ఎమోషనల్‌ క్యారెక్టర్స్‌ చేస్తున్నాను. అలాగే నాలుగు రసాలను పండిరచే ఒక విచిత్రమైన క్యారెక్టర్‌ కూడా చేస్తున్నాను. అన్నింటినీ మించి ఒక పాన్‌ ఇండియా మూవీలో విలన్‌గా నటించబోతున్నాను. అయితే ఆ సినిమాలో హీరో ఎవరు, డైరెక్టర్‌ ఎవరు అనే విషయాలు ఇప్పుడే నేను చెప్పలేను. ఆ సినిమా మాత్రం చాలా బిగ్‌ రేంజ్‌లో ఉండబోతోంది. వివరాలు త్వరలోనే తెలుస్తాయి’ అన్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.