English | Telugu
సైలెంట్ గా వచ్చి షాక్ ఇవ్వబోతున్న నందమూరి హీరో!
Updated : Mar 3, 2025
సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి, రిలీజ్ వరకు ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ప్రమోట్ చేసుకోవడం ఒక పద్ధతి. సినిమాని అనౌన్స్ చేసి, సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసేసి, రిలీజ్ కి ముందు ప్రమోట్ చేసుకోవడం మరో పద్ధతి. నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. రెండో దానినే ఎక్కువగా ఫాలో అవుతుంటాడు.
కళ్యాణ్ రామ్ తన 21వ సినిమాని ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో చేస్తున్నాడు. #NKR21 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోంది. అశోక క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. ఇప్పటిదాకా ఈ సినిమా నుంచి పెద్దగా కంటెంట్ రాలేదనే చెప్పాలి. హడావుడి లేకుండా సైలెంట్ గా మూవీని కంప్లీట్ చేసేస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా వర్క్ దాదాపు పూర్తయిందని తెలుస్తోంది. త్వరలోనే టైటిల్ ను కూడా అనౌన్స్ చేయనున్నారట.
ఇక 'NKR21' గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఫుల్ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. మూవీ అవుట్ పుట్ అదిరిపోతుందని అంటున్నారు. భారీ బడ్జెట్ తో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో.. యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్ లో వచ్చాయట. ఇందులో ఆడియన్స్ ని థ్రిల్ చేసే ఎలిమెంట్స్ ఫుల్ గా ఉన్నాయట. కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉంటుందని, అందుకు తగ్గట్టే ఈ నందమూరి హీరో కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడని చెబుతున్నారు. ఇక ఐపీఎస్ గా విజయశాంతి రోల్ కూడా ఎంతో పవర్ ఫుల్ గా ఉంటుందని.. కళ్యాణ్ రామ్-విజయశాంతి మధ్య వచ్చే సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ అని చెబుతున్నారు.
గతంలో 'బింబిసార' సినిమా టైంలో కూడా ఇదే స్టాటజీ ఫాలో అయ్యాడు కళ్యాణ్ రామ్. ఆ సినిమాని సైలెంట్ గా పూర్తి చేసేసి.. సాలిడ్ కంటెంట్ తో వచ్చి, బ్లాక్ బస్టర్ కొట్టి అందరినీ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇప్పుడు 'NKR21' తోనూ కళ్యాణ్ రామ్ అదే విధంగా షాక్ ఇస్తాడని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
