English | Telugu

కొలంబస్'కి అందుకే కనెక్ట్ అయ్యాను




వరుస విజయాలతో హీరోగా దూసుకెళుతున్నారు సుమంత్ అశ్విన్. మంచి కథలు, పాత్రలు ఎంపిక చేసుకుంటున్న ఈ యువహీరో ప్రస్తుతం నటించిన చిత్రం 'కొలంబస్'. డిస్కవరీ ఆఫ్ లవ్ అనేది ఉపశీర్షిక. ఏకేఎస్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఆర్. సామల దర్శకత్వంలో అశ్వనీ కుమార్ సహదేవ్ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది.

'కొలంబస్' విశేషాలను సుమంత్ అశ్విన్ చెబుతూ - ''లవర్స్, కేరింత.. ఇలా వరుస విజయాల తర్వాత నేను చేసిన చిత్రం ఇది. కథ విని, వెంటనే అంగీకరించాను. అంతగా ఈ కథ నన్ను ఎగ్జయిట్ మెంట్ కి గురి చేసింది. ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఎమోషన్స్ కు కూడా ప్రాధాన్యం ఉన్న కథ. అందుకే కనెక్ట్ అయిపోయాను. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా నచ్చుతుంది. నా పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. ఇందులో నా సరసన 'రన్ రాజా రన్' ఫేం సీరత్ కపూర్, 'చిన్నదాన నీ కోసం'లో చేసిన మిస్తీ చక్రవర్తి కథానాయికలుగా నటించారు.

'ఇష్క్' సినిమాకి రచయితగా పని చేసిన ఆర్. సామల ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. నిర్మాత సహదవ్ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడలేదు. జితిన్ మంచి పాటలు ఇచ్చారు. ఇది రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్ టైనర్. సీన్స్ అన్నీ ఫ్రెష్ గా ఉంటాయి. షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబర్ లో పాటలను, నవంబర్ మొదటి వారంలో సినిమాని విడదల చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.