English | Telugu

'బెంగాల్ టైగర్' జోరు పెరిగింది

కిక్‌ 2 లాంటి డిజాస్టర్‌ తర్వాత మాస్‌ రాజా రవితేజ మార్కెట్ పడిపోయిందని అందరూ కామెంట్లు చేశారు. సినిమాకు పెట్టిన బడ్జెట్‌తో పోల్చుకుంటే అందులో సగం వసూళ్లను కూడా కిక్‌ 2 రాబట్టలేకపోవడంతో రవితేజ సినిమాపై భారీగా ఇన్వెస్ట్‌ చేసేందుకు నిర్మాతలు, బయ్యర్లు ముందుకు రావడం లేదని ఇండస్ట్రీ లో టాక్ నడించింది. కానీ బెంగాల్ టైగర్ రిలీజ్ కి ముందే కొత్త రికార్డులు నెలకొల్పుతుంది. ఈ సినిమా శాటిలైట్‌ రైట్స్‌ను ఓ ప్రముఖ ఛానెల్‌ రూ.7 కోట్లకు దక్కించుకుందట. రవితేజ కేరీర్‌లోనే ఇది హయ్యస్ట్‌ శాటిలైట్‌ రేట్‌ కావడం విశేషం. ఈ సినిమా బడ్జెట్‌ 25 కోట్ల వరకు అయింతే థియేట్రికల్‌ బిజినెస్‌ రూ.34 కోట్ల వరకు జరిగిందని సమాచారం. అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓ రేంజిలో జరుగుతున్నాయి. సో పోటీ లేకుండా సోలోగా విడుదలవుతున్న 'బెంగాల్‌ టైగర్‌'పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి కనిపిస్తోంది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.