English | Telugu

కిక్ 2 లో డబుల్ ఎంటర్‌టైన్మెంట్

కిక్ తో ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చిన మాస్ రాజా రవితేజ, ఇప్పుడు కిక్ 2 తో డబుల్ ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వడానికి సిద్దమైపోయాడు. కళ్యాణ్ రామ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన కిక్ 2 సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్ కి ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి వుండడంతో ఈ సినిమా ప్రమోషన్ జోరు పెంచాడు రవితేజ. మీడియా చిట్ చాట్ లతో హంగామా చేస్తున్నాడు.

బాహుబలి తరువాత తెలుగు సినిమా మార్కెట్ పెరింగిందని అలాగే శ్రీమంతుడు తర్వాత మనం కూడా కాస్త డిఫరెంట్ గా ఏదైనా చేయవచ్చేమో అన్న ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పాడు. ఇక రకుల్ ప్రీత్‌కి డెడికేషన్ బాగా ఎక్కువ అని, మంచి యాక్టర్ అని తన హీరోయిన్‌ని పొగడ్తలతో ముంచేశాడు. కిక్ 2 సినిమా చాలా బాగా వచ్చిందని, ఇందులో కూడా ఎమోషన్లు, మెసేజ్ అన్నీ వున్నాయని అంటున్నారు. అలాగే బెంగాల్ టైగర్ పక్కా కమర్షియల్ సినిమా అని, సంపత్ నంది బాగా తీస్తున్నాడని చెప్పుకొచ్చాడు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.