English | Telugu

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ రిలీజ్ డేట్ ఇదే..మాస్ లకే మాస్ 

మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)ప్రశాంత్ నీల్(Prashanth neel)కాంబోలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని, హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ నిర్మిస్తుంది. ఇటీవలే షూటింగ్ ప్రారంభమవ్వగా, ఎన్టీఆర్ పై కొన్నికీలక సన్నివేశాలని కూడా చిత్రీకరించారు.

రీసెంట్ గా మైత్రి సంస్థ మండుతున్న నిప్పుని డ్రాగన్ ఆకారంలో సింబాలిక్ గా ఉంచి, ఎన్టీఆర్,ప్రశాంత్ పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇద్దరు డైనమిక్ వ్యక్తుల కాంబినేషన్ లో బాక్స్ ఆఫీస్ విధ్వంసమయ్యే అనుభూతికి సిద్ధం కండి. జూన్ 25 2026 న థియేటర్స్ దద్దరిల్లే సౌండ్ మీరు వింటారు. మాస్ లకే మాస్ ఎన్టీఆర్ పుట్టిన రోజు ప్రత్యేక గ్లింప్స్ తో మీ ముందుకు వస్తామని ట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ ట్వీట్ తో ఎన్టీఆర్ అభిమానుల్లో సరికొత్త జోష్ వచ్చినట్లయ్యింది. నిర్మాణ సంస్థ చెప్పినట్టుగా 2026 జూన్ 25 బాక్స్ ఆఫీస్ దద్దరిల్లడం ఖాయమని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు చేస్తున్నారు. మే 20 న వచ్చే ఎన్టీఆర్ గ్లింప్స్ సోషల్ మీడియాలో ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టడం ఖాయమనే నమ్మకాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు

.ఆర్ఆర్ఆర్, దేవర తో ఎన్టీఆర్ వరుస భారీ విజయాల్ని అందుకున్నాడు. కేజీఎఫ్, సలార్ తో ప్రశాంత్ నీల్ కి ఒక బ్రాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో ఎన్టీఆర్,ప్రశాంత్ మూవీపై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పక్కర్లేదు. ఇక ఈ మూవీకి 'డ్రాగన్'(Dragon)అనే పేరు ప్రచారంలో ఉండగా ఎన్టీఆర్ సరసన కన్నడ భామ రుక్మిణి వసంత్(Rukmini Vasanth)జోడి కట్టబోతుందనే ప్రచారం కూడా ఉంది.


టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.