English | Telugu

మ‌హేష్ కూడా చేతులు కాల్చుకొంటాడా?

చిత్ర నిర్మాణం అనేది ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. హేమా హేమీలైన‌వాళ్లే నిర్మాత‌లుగా డింకీలు కొడుతుంటారు. ప‌రిశ్ర‌మ‌లో ఏ నిర్మాత ప‌రిస్థితీ బాలేదు. అలాంటిది ఈ విష‌యాల‌న్నీ తెలిసి తెలిసి త‌ప్పు చేయ‌బోతున్నాడు మ‌హేష్ బాబు. ఔను.. మ‌హేష్ సొంతంగా ఓ నిర్మాణ సంస్థ‌ను నెల‌కొల్పాల‌ని ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. త‌న త‌న‌యుడు గౌత‌మ్ పేరుతో ఓ బ్యాన‌ర్‌ని స్థాపించాల‌ని, ఆ బాధ్య‌త శ్రీ‌మ‌తి న‌మ్ర‌త చేతిలో పెట్టాల‌ని చూస్తున్న‌ట్టు ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు చెప్పుకొంటున్నాయి. మ‌హేష్ ఇంట్లో నిర్మాత‌ల‌కు కొద‌వ లేదు. ప‌ద్మాల‌యా స్టూడియోస్ బ్యాన‌ర్‌పై సినిమాలు చేసుకోవ‌చ్చు. ఇందిర ప్రోడ‌క్ష‌న్స్ కూడా ఉంది. అయినా స‌రే... త‌న చేతిలోమ‌రో నిర్మాణ సంస్థ ఉండాల‌ని మ‌హేష్ భావిస్తున్నాడ‌ట‌. ఈ సంస్థ నుంచి ఏడాదికి ఒక సినిమా వ‌చ్చేట్టు ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. బ‌డా హీరోలూ నిర్మాత‌లైన వైనం మ‌న‌కు తెలుసు. కాక‌పోతే.. వాళ్లంతా దాదాపుగా చేతులు కాల్చుకొన్న‌వారే. అంతెందుకు మ‌హేష్ సోద‌రుడు ర‌మేష్ బాబుకీ నిర్మాత‌గా చేదు అనుభ‌వాలున్నాయి. మ‌రి మ‌హేష్ ఎందుకు ఇంత సాహ‌సం చేస్తున్నాడో?


పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.