Read more!

English | Telugu

విభిన్న ద‌ర్శ‌కునితో విల‌క్ష‌ణ న‌టుడు!

కోలీవుడ్  తో పాటు టాలీవుడ్ లో కూడా హీరో సూర్యకు విలక్షణటునిగా ఒక పేరు ఉంది. ఆయన చిత్రాలు అంటే సంథింగ్ స్పెషల్ గా ఉంటాయని భావించేవారు ఎందరో ఉన్నారు. అందుకే ఆయన చిత్రాలకు తెలుగులో కూడా ఓపెనింగ్స్ బాగానే ఉంటాయి. ఇటీవలే జై భీమ్, ఆకాశం నీ హద్దురా వంటి చిత్రాలతో మంచి విజయాన్ని అందుకొని అవార్డులను కూడా సొంతం చేసుకున్న సూర్య ప్రస్తుతం శివా దర్శకత్వంలో ఓ పీరియాడికల్ హిస్టారికల్ మూవీ ని చేసే పనిలో ఉన్నారు.  అందులోనూ ఇప్పుడు ప్రేక్షకులందరూ ఓటీపీ ద్వారా ప్రపంచ సాయి కంటెంట్ కు బాగా దగ్గర అయిపోవడంతో పక్కా కమర్షియల్ రొటీన్ మాస్ మసాలా ఎంటర్టైన్ చిత్రాలను సూర్య దూరంగా పెడుతున్నారు.  ఏదో ఒక వైవిధ్యమైన పాయింట్ లేనిదే సినిమాలను ఒప్పుకోవడం లేదు. 

సూర్య 42వ సినిమాతో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. సిరుతై శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. స్టూడియో గ్రీన్, యు వి క్రియేషన్స్ బ్యానర్లలో సంయుక్తంగా ఈ సినిమాను భారీ ఎత్తున రూపొందిస్తున్నాయి. దాదాపు పది భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం సూర్యా మలయాళ డైరెక్టర్ తో జతకట్టేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం మలయాళ దర్శకుడు లిజో జోస్ పెల్లిస్సెరి తో సూర్య ఒక సినిమా చేసే అవకాశం ఉందట. మలయాళం లో అంగమలై డైరీ జల్లికట్టు వంటి సినిమాలతో దర్శకునిగా లిజో జోస్ పెల్లిస్సెరి మంచి పేరు తెచ్చుకున్నారు.  ఆయన తాజాగా సూర్యాకు వినూత్నమైన కథను చెప్పాడని తెలుస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయ‌నే వెల్లడించారు.  

తను చెప్పిన స్టోరీ లైన్ కు సూర్య ఇంప్రెస్ అయ్యారు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ప్రాజెక్ట్ ఇంకా పట్టాలెక్కలేదు అని ఆయన చెప్పుకొచ్చారు. నిజానికి ప్రస్తుతం లిజో జోస్ పెల్లిస్సెరి మోహన్ లాల్ తో ఒక సినిమా చేస్తున్నారు. ఈ మధ్యనే ఆయన మోహన్ లాల్ తో మలైకోటై వాలిబాన్ అనే చిత్రాన్ని ప్రకటించారు.  మరోపక్క సూర్య 42వ సినిమా పూర్తి అయిన తర్వాత వెట్రిమార‌న్  దర్శకత్వంలో ఆయన ఓ చిత్రంలో నటించాల్సి ఉంది. అయితే డైరెక్టర్ బాలతో చేస్తున్న సినిమా నుండి బయటకు వచ్చేశానని సూర్యా ప్రకటించిన  తర్వాత మరో సినిమా ప్రకటించలేదు. కాబట్టి ఈ మలయాళ దర్శకుడితో సూర్య 44వ సినిమా చేసే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.