English | Telugu

జెండా ఎత్తేసిన హీరోయిన్ ఎవ‌రు??

ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్ల కేసు తీగ లాగితే డొంక క‌దులుతోంది. ఎర్ర‌చందనం స్మగ్ల‌ర్ల‌కీ.. ఓ టాలీవుడ్ నిర్మాత‌కూ సంబంధం ఉంద‌ని తాజాగా ఎంక్వైరీలో తేలింది. స్మ‌గ్ల‌ర్లు సినిమా ప‌రిశ్ర‌మ‌లో పెట్టుబ‌డి పెట్టార‌ని.. ఓ హీరోయిన్‌కి భారీగా డ‌బ్బులు ట్రాన్స్‌ఫ‌ర్ చేశార‌ని పోలీసులు నిర్దారించారు. ఆ హీరోయిన్ పంజాబీ ప‌డుచ‌ట‌. ప్ర‌తి నెలా ఆ హీరోయిన్ ఖాతాలో భారీగా డ‌బ్బులు జ‌మ‌వుతూ వ‌చ్చాయ‌ట‌. ఈ విష‌యం తెలుసుకొన్న పోలీసులు ఆమె బ్యాంకు ఖాతాల‌ను స్థంభింప‌చేశారు. అదుపులో తీసుకొని ప్ర‌శ్నించాల‌నుకొంటున్న స‌మ‌యంలోనే ఆ హీరోయిన్ బిజానా ఎత్తేసి అండ‌ర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోయింద‌ని టాక్‌. మ‌రి ఆ హీరోయిన్ ఎవ‌రు?? అనే విష‌యంపై ప‌రిశ్ర‌మ‌లో ఆసక్తిక‌ర‌మైన చ‌ర్చ న‌డుస్తోంది. అగ్ర హీరోల‌తో జ‌ట్టు క‌ట్టి... ఇప్పుడో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్న పంజాబీ భామే.. ఆ హీరోయిన్ అని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రి నిజానిజాలేమిటో కాల‌మే చెప్పాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.