English | Telugu

బాహుబలి 'శాటిలైట్' అమ్ముడుపోలేదు

బాహుబలి శాటిలైట్ రైట్స్ టాలీవుడ్ లోనే రికార్డ్ ధరకు అమ్ముడుపోయిందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు నిజంకాదని తెలుస్తోంది. బాహుబలి శాటిలైట్ ని రాజమౌళి అండ్ కో భారీ ధరకు అమ్మాలని డిసైడ్ అయ్యారట.

కానీ చానెల్ వాళ్లు మాత్రం 16 కోట్లు ఇస్తామని అంటున్నారట. సినిమా మీద కాన్ఫిడెన్స్ తో పాతిక కోట్లకు తగ్గేదిలేదని బాహుబలి టీమ్ డిమాండ్ చేస్తున్నారట.. సినిమా రిలీజ్ అయితే అదే ధర ఈజీగా దక్కుతుందని వారు భావిస్తున్నారట. మరి సినిమా రిలీజ్ తరువాత బాహుబలి టీమ్ ఆశిస్తున్న రేట్ దక్కుంతుందా? లేదా? అన్నది ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తిగా మారింది.

ఇదిలా వుండగా..బాహుబలి జూలై 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వడానికి సిద్దంగా వుంది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ ధియేటర్లలో విడుదల చేయబోతున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.