English | Telugu

సింగిల్ మూవీ లాభాల్లో మన సైనికులకు భాగం.. అల్లు అరవింద్ కీలక ప్రకటన!

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. పహల్గామ్ లో జరిగిన ఉగ్ర దాడికి ప్రతీకారంగా.. పాక్ లోని ఉగ్ర స్థావరాలపై భారత్ సైన్యం దాడులు చేసి, పదుల సంఖ్యలో ఉగ్రవాదులను హతమార్చింది. అయితే పాకిస్తాన్ మాత్రం భారత పౌరులను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగింది. దీంతో మన సైన్యం పాక్ కి సరైన సమాధానం చెబుతోంది. ఈ క్రమంలో కొందరు వీరులు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. దీంతో మన సైనికులకు, సైనిక కుటుంబాలకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సైతం సైనికులకు తన వంతు మద్దతు తెలపడానికి ముందుకు అడుగువేశారు.

అల్లు అరవింద్ కి చెందిన గీతా ఆర్ట్స్ నిర్మించిన 'సింగిల్' మూవీ నేడు(మే 9) థియేటర్లలో అడుగుపెట్టింది. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్.. పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ కీలక ప్రకటన చేశారు. సింగిల్ సినిమా వసూళ్ల నుంచి వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని మన సైనికులకు అందించనున్నామని ప్రకటించారు. మన సైనికులకు తమ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని అల్లు అరవింద్ తెలిపారు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.