English | Telugu
రాజ్ తరుణ్, శివానీల 'అహ నా పెళ్ళంట'కు సూపర్ రెస్పాన్స్
Updated : Nov 25, 2022
రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన వెబ్ సిరీస్ 'అహ నా పెళ్ళంట'. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ నవంబర్ 17 నుంచి జీ5లో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇందులో హీరోది 'పెళ్ళికి ముందు హనుమంతుడిలా, పెళ్లి తర్వాత శ్రీరాముడిలా ఉండాలి' అనుకునే ఓ పాతికేళ్ల యువకుడి పాత్ర. అయితే అతను ఘనంగా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన వేళ.. ఊహించని విధంగా అతను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి తన ప్రియుడితో వెళ్లిపోతుంది. దీంతో హీరో ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో కథ ఎలాంటి మలుపులు తీసుకుందనేది ఆసక్తికరంగా చూపించారు.
రీసెంట్గా విడుదలైన 'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్ అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ వారం రోజుల్లోనే 50 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ మార్క్ను రీచ్ అయ్యింది. అంతే కాకుండా ఐఎండీబీ ప్రకటించిన టాప్ టెన్ ప్రేక్షకాదరణ పొందిన వెబ్ సిరీస్ల లిస్టులోనూ చోటు దక్కించుకుంది.
హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ శివానీ రాజశేఖర్ మధ్య కెమిస్ట్రీ మెయిన్ హైలైట్ అని అందరూ అంటున్నారు. హీరో హీరోయిన్ జోడీ మధ్య ఉండే కెమిస్ట్రీతో పాటు క్లీన్ కామెడీ, రొమాన్స్ అన్నీ చక్కగా కుటుంబం అంతా కలిసి చూసేలా ఉందనే టాక్ ని ఈ వెబ్ సిరీస్ తెచ్చుకుంది. అందుకేనేమో అతి కొద్ది సమయంలోనే 50 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ సాధించి కామెడీ వెబ్ సిరీస్లలో ఓ రికార్డ్ను నెలకొల్పింది.