English | Telugu
సినిమా పేరు:సిద్ధం
బ్యానర్:శ్రేయ ప్రొడక్షన్స్
Rating:2.25
విడుదలయిన తేది:Feb 12, 2009
బ్యానర్:శ్రేయ ప్రొడక్షన్స్
Rating:2.25
విడుదలయిన తేది:Feb 12, 2009
ఇది దయానంద్ (జగపతిబాబు) అనే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కథ. అతనికి భార్య (సింధూ తులానీ), కూతురు హరిణి ఉంటారు. అతనితో పాటు ఫ్రాన్సిస్, అఖిల్, సలీమ్ అనే వారు కూడా అదే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా, దయానంద్కి వచ్చినంత పేరు ఇంకెవరికీ రాదు. అది సలీమ్కి కంటికంపుగా ఉంటుంది. దుబాయ్లో ఉండే బిలాల్, ఛోటా అనే ఇద్దరు మాఫియా లీడర్లు, హైదరాబాద్లో తమ ముఠాలతో వేరు వేరుగా తమ తమ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటారు. ఛోటా అనుచరుడైన అశోక్ (సుబ్బరాజు) తన తల్లి అనారోగ్యంతో ఉంటే మలేసియా నుంచి హైదరాబాద్ వస్తాడు. ఇది తెలుసుకున్న దయానంద్ తన సహచరులతో అశోక్ ఇంటి మీద దాడి చేస్తాడు. దయానంద్ వద్దంటున్నా సలీమ్ జరిపిన కాల్పుల్లో అశోక్ తల్లి చనిపోతుంది. దయానంద్ ఆఫీసుకు మాఫియా వారితో కనెక్షన్లున్న కొత్త పోలీస్ కమీషనర్ (రాధారవి) వస్తాడు. అతనికి సలీమ్ బాగా దగ్గరవుతాడు. దయానంద్ మీద కొత్త కమీషనర్కి సలీమ్ వలన అకారణ ద్వేషం ఏర్పడుతుంది. దయానంద్ని కమీషనర్ అవమానిస్తుంటే, తన ఉద్యోగానికి దయానంద్ రాజీనామా చేస్తాడు. రాజీనామా చేసినా ఒక పోలీస్గా దయానంద్ తన డ్యూటీని చేస్తూనే ఉంటాడు. కార్పొరేటర్ సుధీర్ని చంపేస్తాడు దయానంద్. దాంతో దయానంద్ మీద షూట్ ఎట్ సైట్ ఆర్డర్ వేస్తాడు కమీషనర్. ఇదే అదునుగా భావించిన సలీమ్ దయానంద్ని చంపబోతే అఖిల్ తన రివాల్వర్తో సలీమ్ని చంపుతాడు. దయానంద్ పోలీస్ కమీషనర్ని చంపుతాడు. తాను కూడా క్రిమినల్ కనుక తనను కాపాడమనీ, దుబాయ్కి తీసుకెళ్ళమని బిలాల్కి దయానంద్ చెపుతాడు. దాంతో దయానంద్ని దుబాయ్కి రప్పిస్తాడు బిలాల్. అక్కడ తన భార్యని చంపిన బిలాల్ని దయానంద్ చంపేస్తాడు. చివరికి మాజీ కమీషనర్ సాయంతో, తన ఉద్యోగంలో చేరతాడు దయానంద్ ఇది కథ.