English | Telugu
సినిమా పేరు:మిత్రుడు
బ్యానర్:వైష్ణవి సినిమా
Rating:2.50
విడుదలయిన తేది:May 1, 2009
బ్యానర్:వైష్ణవి సినిమా
Rating:2.50
విడుదలయిన తేది:May 1, 2009
మలేసియాలో ఉంటున్న ఆదిత్య (బాలకృష్ణ) పక్కా తాగుబోతు.అతను చావుకోసం ఎదురుచూస్తున్న మనిషి. ఇందు (ప్రియమణి) మలేసియాలో ఉండి యమ్.బి.ఎ. చదువుకునే ఇండియన్ అమ్మాయి. ఆమే తండ్రి సాయికృష్ణ (రంగనాథ్) పెద్ద పారిశ్రామికవేత్త. అతని ఒక్కగానొక్క కూతురు ఇందు. మునుస్వామి (ప్రదీప్ రావత్) అనే గూండా తన కొడుక్కి ఇందూని ఇవ్వమని సాయికృష్ణని అడుగుతాడు. అందుకు సాయి కృష్ణ అంగీకరించడు. మలేసియా ఉన్న ఇందు తన జాతకాన్ని తమిళనాడులోని మధురైలో చూపించగా, ఆమెకు వైధవ్యం ఉందనీ, అది పోవాలంటే ఒక ప్రత్యేకమైన జాతకుణ్ణి పెళ్ళి చేసుకుంటే, అతను నెలరోజుల్లో చనిపోతాడనీ చెపుతారు అక్కడి జ్యోతిష్కులు. ఆ లక్షణాలున్న వ్యక్తి ఆదిత్యని చూసి, అతని వెంటపడి ప్రేమించానని పట్టుబట్టి మరీ పెళ్ళిచేసుకుంటుంది ఇందు. ఆమె నిజానికి మధు (దీపక్)ని పెళ్ళిచేసుకోవాలనుకుంటుంది. ఈ మధు మరెవరో కాదు ఇందు వాళ్ళ ఫ్యాక్టరీలో పనిచేసే కేశవరావు (చంద్రమోహన్) కోడుకు. కానీ తన జాతకం ప్రకారం భర్త చనిపోతాడు గనుక, ఆదిత్యను పెళ్ళిచేసుకుని అతను చనిపోగానే, తనకిష్టమైన మధుని చేసుకుందామని ఇందు ఆలోచన. పైకి మంచి వాడుగా కనిపించే మధు నిజానికి దుర్మార్గుడు.ఇవేవీ తెలియని ఆదిత్య, ఇందుని వివాహం చేసుకుంటాడు. మలేసియా నుండి ఇంటికి రాగానే ఇందు తండ్రి ఇందూని, ఆమె భర్త ఆదిత్యనూ అవమానపరుస్తాడు. ఒకసారి సాయికృష్ణ కొత్త ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి మంత్రి అయిన మునుస్వామి వచ్చి సాయి అల్లుడి గురించి హేళనగా మాట్లాడతాడు. దాంతో ఇంట్లో భోజనం చేసే అల్లుణ్ణి అవమానిస్తాడు సాయికృష్ణ. అయినా ఇందు కోసం అవన్నీ భరిస్తాడు ఆదిత్య. తన మావను అవమానించినందుకు గాను మునుస్వామి ఇంటికెళ్ళి అతన్ని కొట్టి వస్తాడు ఆదిత్య. ఇందుతో ఆదిత్య పెళ్ళి జరిగి 29 రోజులవుతాయి. 30వ రోజున కేశవరావు తన మనుషులతో ఆదిత్యను రెచ్చగొట్టే మాటలనిపించి, వారు అతని చేతిలో తన్నులుతినేలా చేసి, సాయికృష్టకు ఫోన్ చేసి పిలుస్తాడు. అది చూసి కేశవరావు కొడుకు మధు తన తండ్రినే కత్తితో పొడుస్తాడు. అది చూసిన ఆదిత్య అతన్ని వెంబడిస్తాడు. అక్కడికి ఇందు వస్తుంది.ఇందు, మధు, ఆదిత్య గొడవ పడుతూంటే ఒక లారీ వచ్చి ఆదిత్యను గుద్దేస్తుంది. దాంతో ఒక రాయికి తలకొట్టుకుని స్పృహ కోల్పోతాడు ఆదిత్య. అతన్ని హాస్పిటల్లో చేరుస్తారు. హాస్పిటల్లో కూడా సాయికృష్ణ ఆదిత్యని తూలనాడుతూ మాట్లాడుతుంటే విన్న లాయర్ విశ్వనాథ్ (కృష్ణ భగవాన్) అప్పుడు అతనికి నిజం చెపుతాడు. నిజానికి ఆదిత్యను తన అల్లుడు చేసుకోవాలనుకుంటాడు సాయికృష్ణ. కానీ సాయికృష్ణ వల్లే ఒక ప్రమాదంలో గ్యాస్ సిలెండర్లు పేలి గంపెడుమంది ఉంటే ఆదిత్య కుటుంబం అంతా ఆ మంటల్లో మాడి మసైపోతుంది. ఆ విషయం సాయికృష్ణకు లాయర్ విశ్వనాథ్ చెప్పగానే, లోపలికి వెళ్ళి ఆదిత్యను చూడాలనుకుని వెళ్ళగా అక్కడ అతనుండడు. తన వారు చనిపోయి అప్పటికి సరిగ్గా సమవత్సరమ కావటంతో, అతను తన ఊరుకి వెళ్ళి తన వారందరికీ పిండప్రదానం చేసి, తన ఇంటికి వెళ్ళి అక్కడ పడిపోతాడు. అక్కడికి చేరుకున్న ఇందుకి తన నిజస్వరూపం చూపిస్తాడు మధు. అదే సమయానికి అక్కడికి మంత్రి మునుస్వామి తన బలగంతో వస్తాడు. ఆ తర్వాతేం జరిగిందనేది మిగిలిన కథ.