English | Telugu
సినిమా పేరు:ఏం పిల్లో ఏం పిల్లడో
బ్యానర్:ఈ తరం పిక్చర్స్
Rating:2.00
విడుదలయిన తేది:Jul 16, 2010
బ్యానర్:ఈ తరం పిక్చర్స్
Rating:2.00
విడుదలయిన తేది:Jul 16, 2010
దేవరకొండ,పోతుగడ్డ గ్రామాలకు మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమంటుంది.ఒక ఊరికి ఆహుతి ప్రసాద్,మరో ఊరికి చరణ్ రాజ్ పెద్దలు.నిజానికి వాళ్ళిద్దరూ బావ,బావమరుదులే.ఇది సినిమా చివరలో తెలుస్తుంది.వీళ్ళిద్దరికీ మధ్య గొడవ ఎందుకొచ్చిందీ అనే దానికి ఒక బలమైన కారణం ఉంటుంది.చరణ్ రాజ్ చెల్లెలు పెళ్ళిలో ఆమె ఒక లెటర్ వ్రాసి పెట్టి వెళ్ళిపోతుంది.తాను ఆహుతి ప్రసాద్ ని ప్రేమిస్తున్నాని దాని సారాంశం.ఆహుతు ప్రసాద్ ఆమెను తిట్టి పెళ్ళి మంటపానికి తెచ్చే లోపల,చరణ్ రాజ్ మామ ఆహుతి ప్రసాద్ మీద అతనికి లేనిపోని మాటలు చెప్పి,వాళ్ళిద్దరి మధ్య గొడవకు కారణమవుతాడు.అప్పుడు జరిగిన గొడవలో ఆహుతి ప్రసాద్ తండ్రి చనిపోగా,చరణ్ అరాజ్ మామ చనిపోతాడు.అలా వీళ్ళిద్దరి మధ్య గొడవ మొదలవుతుంది.ఆహుతి ప్రసాద్ కొడుకు తనీష్ అయితే చరణ్ రాజ్ కూతురు ప్రణీత.వీళ్ళిద్దరూ పట్నంలో ఒకే కాలేజీలో చదుతూంటారు.ఆ ఇద్దరికీ అరక్షణం పడదు.అలాంటిది ఒక సందర్భంలో ఇద్దరూ ప్రేమలో పడతారు.వాళ్ళ ఊర్ల మధ్య ఉన్న గొడవ గురించి తెలిసిన తనీష్,ప్రణీత తమ పెద్దల అనుమతితో తమ ప్రేమను ఎలా సఫలం చేసుకున్నారన్నది మిగిలిన కథ.