English | Telugu
సినిమా పేరు:ద్రోణ
బ్యానర్:సాయికృష్ణా ప్రొడక్షన్స్
Rating:2.00
విడుదలయిన తేది:Feb 20, 2009
బ్యానర్:సాయికృష్ణా ప్రొడక్షన్స్
Rating:2.00
విడుదలయిన తేది:Feb 20, 2009
ద్రోణ (నితిన్)ని చిన్నతనంలో సర్కార్ (కిల్లిదొర్జీ) ముఠా కిడ్నాప్ చేస్తుంది. ఎస్.పి. మనోహర్ (ముఖేష్రుషి). మీనాక్షి (సీత) కొడుకు ద్రోణ. తండ్రి కొట్టాడనే కోపంతో ఇంట్లోంచి పారిపోయాడని వారు భావిస్తుంటారు. సర్కార్ ద్రోణలాంటి మరికొంత మంది పిల్లలని ఐలండ్ దీవులకి తీసుకుపోయి వారికి కఠినమైన శిక్షలు ఇస్తాడు. ఇదంతా ఎందుకంటే మైసూర్లో ప్రదర్శనలకు పెట్టిన నిజాం నగలని వారిచే దొంగిలించి, వాటిని తీసుకుని తాను దుబాయ్ పోవాలని. అయితే అనుకున్నట్లుగానే నిజాం నగలని ద్రోణ తన ఫ్రెండ్ బోసు (నందకిశోర్), మరో వ్యక్తితో కలిసి నిజాం నగలని దొంగతనం చేసి తీసుకువస్తాడు. అయితే ఆ నగలని తీసుకుని తామందరినీ చంపేయాలని సర్కార్ కుట్రపన్నాడని తెలుసుకున్న ద్రోణ ఆ నగలతో ఉడాయిస్తాడు. మారు పేరుతో తన ఇంట్లోనే ఉంటూ తనకోసం తన తల్లీదండ్రులు పడుతున్న వేదనని చూస్తూ బాధపడుతుంటాడు. ద్రోణనే పెళ్ళి చేసుకుంటానని ఆ ఇంటికి వస్తున్న ఇందు (ప్రియమణి)తో ప్రేమలో పడతాడు. సర్కార్ గ్యాంగ్ ద్రోణకోసం వెతుక్కుంటూ వస్తుంది. నిజాం నగలు కాజేసింది ద్రోణ అని పోలీసులకి చెప్పి అతన్ని అరెసు్ట చేయిస్తారు. తన కొడుకు దొంగగా మారడాన్ని జీర్ణించుకోలేకపోతాడు మనోహర్. అయితే అతనెందుకు దొంగయ్యాడో తల్లీదండ్రులకి చెప్పడంతో కొడుకుని రక్షించడానికి ఎస్.పి. మనోహర్ పథకం వేస్తాడు. చివరికి ద్రోణ సర్కార్ బారి నుండి నిజాం నగలని ఎలా రక్షించాడన్నది క్లైమాక్స్.