English | Telugu
సినిమా పేరు:బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం
బ్యానర్:లక్కీ మీడియా, యుటోపియా
Rating:2.25
విడుదలయిన తేది:Jul 29, 2010
బ్యానర్:లక్కీ మీడియా, యుటోపియా
Rating:2.25
విడుదలయిన తేది:Jul 29, 2010
బ్రహ్మలోకంలో బ్రహ్మ(రాజేంద్రప్రసాద్)గారు తన భార్య సరస్వతి(కళ్యాణి)తో తగువాడి,ఆమె మీద కోపంతో ఒకరికి పొరపాటు రాత రాస్తాడు.అదేంటంతే ఒకమ్మాయికి పెళ్ళవగానే చావాలని నుదిటి రాత రాస్తాడు.వయసు పై బడుతున్నాపెళ్ళి కాని శీను(శివాజీ)కి కనీసం డిగ్రీ అయినా పుర్తిచేస్తే ఎవరైనా పిల్లనిస్తారని అతన్ని మళ్ళీ కాలేజ్ కి పంపిస్తుంది.కాలేజీలో చేరిన తొలి రోజే అక్కడ కనిపించిన శ్వేత (సోనియా)అనే అమ్మాయిని చూసి ఫిదా అవుతాడు శీను.దాని ఫలితంగా ఆమె బావ జాక్సన్ (రఘుబాబు)చేతిలో చావుదెబ్బలు తింటాడు శీను.ఇదిలా ఉంచితే పరమ బద్ధకస్తుడైన శీను స్నేహితుడు శోభన్ బాబు(వేణుమాధవ్)అదవుల్లో మునీశ్వరుల సలహా మేరకు బ్రహ్మకోసం తపస్సు చేస్తాడు.ఆయన కూడా ఆహా నన్ను కొలిచే ఈ భక్తుణ్ణి పెద్దగా ఇబ్బంది పెట్టకూడదనుకుని వెంటనే ప్రత్యక్షమౌతాడు.అయితే అతనికి ఒక విచిత్రమైన వరం ఇస్తాడు.ఒక కలశం ఇచ్చి అందులోని పాలు తాగితే భవిష్యత్తు తెలుస్తుందని చెపుతాడు.జాక్సన్ చేతిలో చావుదెబ్బలు తిన్న శీను ఆ కలశం ఉన్న చోటే పడి అనుకోకుండా ఆ కలశంలోని పాలు తాగుతాడు.దాంతో ఆ వరం శీనుకి లభిస్తుంది.వాళ్ళిద్దరూ స్నేహితులే కాబట్టి భవిష్యత్తు చెపుతూ లక్షలు గడిస్తారు.బ్రహ్మ పొరపాటు రాత రాసింది శీను ప్రేమించినశ్వేతకే.శీను ఒకసారి స్కూలు పిల్ల బస్సు ప్రమాదానికి గురౌతుందన్న భవిష్యత్తుని తెలుసుకుని ఆ ప్రమాదాన్నుంచి ఆ పిల్లలను కాపాడతాడు.యమలోకానికి రావాల్సిన ఆ స్కూలు పిల్లలు ఎందుకు రాలేదు అన్న కారణం తెలుసుకోటానికి యముడు (జయప్రకాష్ రెడ్డి)బ్రహ్మలోకం వెళ్ళి ఆయన్ని ఈ విషయం గురించి అడుగుతాడు.తానిచ్చిన వర ప్రభావం వల్లే ఇదంతా జరిగిందని తెలుసుకుని తన వరాన్ని తిరిగి తీసుకోటానికీ,తాను తప్పును దిద్దుకోటానికీ యమ,చిత్రగుప్తుల(ఎవియస్)తో పాటు భూలోకం బయలుదేరతాడు బ్రహ్మ.ఆదిపరాశక్తి(లయ)వీళ్ళ తప్పును దిద్దుకోటానికి వీరికి ఒక మాసం మాత్రం గడువిస్తుంది.ఆ తర్వాత వారు భూలోకంలో ఏమేం చేశారు...?ఆ తదనంతర పరిణామాలేంటి అన్నది మిగిలిన కథ.