Read more!

English | Telugu

గణేష్ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు

లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్‌ గణేష్‌ ఆచార్యపై చార్జ్‌షీట్‌ దాఖలైంది. ఆయన దగ్గర అసిస్టెంట్‌ గా పనిచేసిన ఓ మహిళా కొరియోగ్రాఫర్‌ ఫిర్యాదు మేరకు.. ఆయనతో పాటు ఆయన అసిస్టెంట్స్ పై 354-ఎ, 354-సి, 354-డి, 509, 323, 504 సెక్షన్ల కింద ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.

గణేష్ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడంటూ 2020లో ఆ మహిళ ఫిర్యాదు చేసింది. 2010లో ఆయనతో శృంగారంలో పాల్గొనాలని బలవంతపెట్టాడని, పోర్న్ వీడియోలు చూపించి అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది. అంతేకాకుండా శృంగారానికి ఒప్పుకోకపోతే ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించినట్లు పేర్కొంది. అయినా తాను ఒప్పుకోకపోయేసరికి గణేష్ మాస్టర్, అతని అసిస్టెంట్లు తనపై దాడి చేశారని తెలిపింది. ఇండియన్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ కొరియోగ్రాఫర్స్‌ అసోసియేషన్‌ లో సభ్యత్వం కూడా రద్దు చేయించారని చెప్పుకొచ్చింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు.

కాగా బాలీవుడ్ లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న గణేష్‌ ఆచార్య టాలీవుడ్ కి కూడా సుపరిచితమే. 'పుష్ప ది రైజ్' మూవీలో సమంత చిందేసిన 'ఊ అంటావా మావ.. ఊఊ అంటావా' అనే స్పెషల్ సాంగ్ కి ఆయనే కోరియోగ్రఫీ చేశాడు.