Read more!

English | Telugu

'ఎంఎస్ ధోని' యాక్ట‌ర్ ఆత్మ‌హ‌త్య‌

 

బాలీవుడ్ న‌టుడు సందీప్ న‌హ‌ర్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. 'ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ'లో ధోని సిక్కు మిత్రుడు ప‌ర‌మ్ భ‌య్యాగా న‌టించిన సందీప్ ప‌ర్స‌న‌ల్ ప్రాబ్లెమ్స్ వ‌ల్లే తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న‌ట్లు త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్ ద్వారా సూసైడ్ నోట్‌ను షేర్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఫేస్‌బుక్‌లో సూసైడ్ నోట్‌తో పాటు ఓ వీడియోను కూడా ఆయ‌న షేర్ చేశారు. 

ఈ వీడియోలో భార్య కాంచ‌న్ శ‌ర్మ‌తో త‌ను మంచి అనుబంధాన్ని నెల‌కొల్పుకోలేక పోయాన‌ని వెల్ల‌డించారు. ముంబైలోని ఓషివ‌రాలో ఉన్న త‌న నివాసంలో సందీప్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు పోలీసులు ధ్రువీక‌రించారు. ఈ ఉదంతంపై వారు కేసు న‌మోదు చేసి, ద‌ర్యాప్తు చేస్తున్నారు.

సంద‌ర్భ‌వ‌శాత్తూ తెర‌పై ఎంఎస్ ధోనిగా న‌టించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గ‌త ఏడాది ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం, అది సంచ‌ల‌నం సృష్టించ‌డం తెలిసిందే. ఇప్ప‌టికీ ఆ కేసు న‌డుస్తూనే ఉంది. 

సందీప్ విష‌యానికి వ‌స్తే అక్ష‌య్ కుమార్ మూవీ 'కేస‌రి'లోనూ అత‌ను బూటా సింగ్ అనే క్యారెక్ట‌ర్ చేశారు‌. ఏఎల్‌టీ బాలాజీ వెబ్ సిరీస్ 'కెహ్‌నో కో హ‌మ్‌స‌ఫ‌ర్ హై'లో, జీ5లో వ‌చ్చిన 'షుక్ర‌ను', సోనాక్షి సిన్హా న‌టించిన 'ఖాందానీ ష‌ఫ‌ఖానా'లోనూ ఆయ‌న న‌టించారు.