English | Telugu
చచ్చీచెడీ 5 రోజుల్లో 15 కోట్లు వసూలు చేసిన రణవీర్ సింగ్ సినిమా
Updated : May 18, 2022
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ లేటెస్ట్ ఫిల్మ్ 'జయేశ్భాయ్ జోర్దార్' బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలమైంది. విడుదలైన రోజు విమర్శకులు పెదవి విరిచిన ఈ సినిమా, ప్రేక్షకుల నుంచి కూడా అదే విధమైన స్పందనను పొందుతోంది. ట్రేడ్ వర్గాల ప్రకారం ఐదు రోజుల్లో ఈ సినిమా చచ్చీచెడీ దేశవ్యాప్తంగా రూ. 15 కోట్ల నెట్ వసూలు చేసింది.
కామెడీ డ్రామాగా దివ్యాంగ్ ఠక్కర్ డైరెక్ట్ చేసిన 'జయేశ్భాయ్ జోర్దార్' మే 13న థియేటర్లలో రిలీజైంది. రణవీర్ సింగ్ గుజరాతీ యువకునిగా నటించిన ఈ సినిమా వీకెండ్లోనూ చాలా తీసికట్టుగా వసూళ్లను సాధించింది. ఇక పనిరోజుల్లో ఈ సినిమాకు ఎలాంటి వసూళ్లు వస్తున్నాయో ఊహించుకోవచ్చు.
యశ్ రాజ్ ఫిలిమ్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ తీసిన ఈ సినిమాలో 'అర్జున్రెడ్డి' ఫేమ్ షాలినీ పాండే హీరోయిన్గా నటించింది. ఆమెకు బాలీవుడ్లో ఇదే ఫస్ట్ ఫిల్మ్. న్యూ బ్రాండ్ హీరోయిజంను ప్రదర్శించిన రణవీర్ సింగ్ ఆడియెన్స్ను ఆకట్టుకోవడంలో మాత్రం ఫెయిలయ్యాడు. బొమన్ ఇరానీ, రత్నా పాఠక్ షా, దీక్షా జోషి కీలక పాత్రలు పోషించారు.