Read more!

English | Telugu

రెండోసారి కరోనా బారిన పడిన అమితాబ్

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడ్డారు. ఆయన కరోనా బారిన పడటం ఇది రెండోసారి. గతంలో 2020 లో ఆయనకు కరోనా సోకగా, ఇప్పుడు తాజాగా మరోసారి కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా స్వయంగా ఆయనే తెలియజేశారు.

 

మొదటిసారి 2020లో కరోనా బారిన అమితాబ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకొని కోలుకున్నారు. ఆ సమయంలో ఆయన కుమారుడు అభిషేక్, కోడలు ఐశ్వర్య, మనవరాలు ఆరాధ్య సైతం కరోనా బారిన పడి కోలుకున్నారు. మళ్ళీ రెండేళ్ల తర్వాత ప్రస్తుతం 'కౌన్ బనేగా క్రోర్‌పతి' టీవీ షో షూటింగ్ లో పాల్గొంటున్న ఆయనకు తాజాగా మరోసారి కరోనా సోకింది. తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని, ఇటీవల తనను కలిసిన వాళ్ళు కరోనా పరీక్షలు చేసుకోవాలి ఆయన ట్వీట్ చేశారు.

అమితాబ్ త్వరగా కోలుకోవాలని కోరుకంటూ అభిమానులు, ప్రముఖులు ట్వీట్స్ చేస్తున్నారు.