English | Telugu
రష్మికతో సినిమాని ఆపేసిన కరణ్ జోహార్!
Updated : Aug 30, 2022
గత నెల మొదట్లో టైగర్ ష్రాఫ్, రష్మికా మందన్న జంటగా నటిస్తోన్న 'స్క్రూ ఢీలా' మూవీ హై-ఆక్టేన్ యాక్షన్ ప్యాక్డ్ టీజర్కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మూడు నిమిషాల నిడివి ఉన్న ఆ టీజర్లో తనదైన స్టైల్లో టైగర్ ష్రాఫ్ కొంతమంది రౌడీలతో ఫైట్ చేస్తుండటం ఫ్యాన్స్కు అమితంగా నచ్చేసింది. అయితే, లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఈ సినిమా నిర్మాణాన్ని ఆపేశాడు.
టాలీవుడ్లో టాప్ హీరోయిన్ రేంజ్ను ఎంజాయ్ చేస్తోన్న రష్మిక, బాలీవుడ్లో అడుగుపెట్టి 'మిషన్ మజ్ను', 'గుడ్బై', 'యానిమల్' లాంటి సినిమాలు చేస్తోంది. వీటిలో ఇప్పటికే 'మిషన్ మజ్ను', 'గుడ్బై' సినిమాల షూటింగ్ పూర్తయి, విడుదలకు రెడీ అవుతున్నాయి. సందీప్రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న 'యానిమల్'లో రణబీర్ కపూర్ జోడీగా నటిస్తోంది రష్మిక.
కరణ్ జోహార్ నిర్మిస్తోన్న 'స్క్రూ ఢీలా'లో టైగర్ ష్రాఫ్ జోడీగా నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శశాంక్ ఖైతాన్ ఈ మూవీకి దర్శకుడు. ఇందులో నటించేందుకు రూ. 35 కోట్లు రెమ్యూనరేషన్ అడిగాడు టైగర్. అయితే ఆర్థికంగా సినిమాకు అది వర్కవుట్ అవదని భావించిన కరణ్ జోహార్, అతడిని రెమ్యూనరేషన్ తగ్గించుకోమని, లేదంటే దాని బదులు ప్రాఫిట్లో షేర్ తీసుకోమని అడిగాడు. అయితే ఇందుకు టైగర్ ఒప్పుకోలేదు. రూ. 20 కోట్లు ఇస్తానని కరణ్ చెప్పాడనీ, కానీ టైగర్ రూ. 35 కోట్లకు ఒక్క రూపాయి కూడా తగ్గేది లేదని తేల్చిచెప్పాడనీ బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీంతో ఈ సినిమాని పక్కన పెట్టేయడానికే కరణ్ జోహార్ డిసైడ్ అయ్యాడు. ఫలితంగా రష్మికకు బాలీవుడ్లో ఓ ఛాన్స్ మిస్సయ్యింది.