LATEST NEWS
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ వైఖరిపై తాడికొండ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మాదిగ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగువన్ ఇంటర్వ్యూ లో ఆమె అమరావతిపై జగన్ కుట్రలను బయటపెట్టారు. అందరూ జగన్ ను సైకో సైకో అంటారు కానీ  తాను జగన్ సైకో తో పాటు శాడిస్ట్ కూడా అంటానన్నారు.  ఇటీవల విజయవాడలో ఒక పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న జగన్, అమరావతి రాజధాని కాదంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ  హయాంలో రాజధాని అమరావతి విషయంలో జరిగిన పరిణామాలను, దళిత ప్రతినిధులుగా తాము అనుభవించిన మానసిక క్షోభను   వివరించారు. 2019 ఎన్నికల సమయంలో తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవి..  అప్పట్లో సర్వేల ఆధారంగా అత్యంత క్లిష్టమైన రాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు. అయితే..  గెలిచిన తర్వాత జగన్ మోహన్ రెడ్డిని కలిసినప్పుడు, ఆయన కనీస గుర్తింపు ఇవ్వకుండా కేవలం తన బొమ్మ చూసి మాత్రమే గెలిచారంటూ చులకనగా మాట్లాడారని  ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో జగన్ వైఖరి అత్యంత దారుణంగా ఉండేదన్న ఆమె..   పరిపాలన సాగించే క్రమంలో దళిత ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధులను ఆయన ఏనాడూ గౌరవించలేదని, కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసమే వాడుకున్నారన్నారు.  అధికారంలో ఉన్న పార్టీని, పదవులను వదులుకుని తాము బయటకు రావడానికి జగన్ పెట్టిన టార్చరే కారణమని శ్రీదేవి కుండబద్దలు కొట్టారు. 2023లోనే తాను వైసీపీని వీడి అప్పటి ప్రతిపక్షంలోకి రావడం వెనుక ఎంతో మానసిక సంఘర్షణ ఉందన్నారు. ఒక దళిత మహిళా ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితిని కల్పించారని, రాజధాని ప్రాంత రైతులపై దాడులు జరుగుతుంటే స్థానిక ఎమ్మెల్యేగా తాను ఏమీ చేయలేక తీవ్ర వేదన అనుభవించానని పేర్కొన్నారు. అమరావతి, మూడు రాజధానులు, వైజాగ్ కాపురం, ఇప్పుడు కొత్తగా  మావిగన్ అంటూ జగన్ మోహన్ రెడ్డి పదేపదే మాటలు మార్చడం కేవలం ప్రజలను మభ్యపెట్టడానికేనని ఉండవల్లి శ్రీదేవి విశ్లేషించారు. నాడు కోర్టు ఆదేశాల మేరకు సీఆర్డీఏ అధికారులు అమరావతిలో పనులు చేస్తున్నట్లు కేవలం ఒక గంట పాటు డ్రామాలు ఆడారని, అదంతా కేవలం ప్రదర్శన  కోసమేనని  బయటపెట్టారు. రాజధాని కోసం ఒక్క పైసా ఆశించకుండా 33 వేల ఎకరాల భూములు ఇచ్చిన అమరావతి రైతులపై జగన్ ప్రభుత్వానికి ఎన్నడూ   ప్రేమ లేదన్న శ్రీదేవి ఐదేళ్ల పాటు రైతులను నానా ఇబ్బందులు పెట్టిన జగన్..  ఇప్పుడు మళ్లీ వారిపై మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ప్రాంతాల మధ్య, కులాల మధ్య పరస్పర విభేదాలు సృష్టించి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడమే జగన్ అసలు వ్యూహమని ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  రాయల్‌గా సచివాలయానికి వస్తూ, రాజధాని అభివృద్ధిపై స్పష్టమైన విజన్‌తో ముందుకు సాగుతున్నారని శ్రీదేవి కొనియాడారు. జగన్ మోహన్ రెడ్డి లాంటి నాయకులు చేసే తాత్కాలిక రాజకీయాలు ఇకపై సాగవని, ప్రజలు ఇప్పటికే ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. అమరావతి భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని శ్రీదేవి అన్నారు.    Undavalli Sridevi Exclusive Interview, YS Jagan Mohan Reddy Strategy, Amaravati Capital Issue, Tadikonda Ex MLA Sridevi, Chandrababu Naidu Secretariat  
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టీల కోసం ప్రాణాలర్పించే కార్యకర్తల వాస్తవ పరిస్థితిపై తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యక ఇంటర్య్వూలో  తెలుగుదేశం సీనియర్ కార్యకర్త సిరిపురం శ్రీధర్  మాట్లాడారు. ఎన్నికల సమయంలో, పార్టీ ఉద్యమాల్లో జెండాలు మోసి, ప్రత్యర్థులతో పోరాడే సాధారణ కార్యకర్తలు చివరకు కేసులపాలై కోర్టుల చుట్టూ తిరుగుతుంటే ఏ రాజకీయ పార్టీ కూడా వారిని పట్టించుకోవడం లేదనే చేదు నిజాన్నిఆయన ఇసుమంతైనా సంకోచం లేకుండా కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. రాజకీయ పార్టీలు కార్యకర్తలను కేవలం వాడుకుని వదిలేస్తున్నాయా  అంటే ఔననే అనాలని సిరిపురం శ్రీధర్ అన్నారు.  తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్నేళ్లుగా రాజకీయ కక్ష సాధింపులు, కేసుల పరంపర విపరీతంగా పెరిగిపోయింది. పార్టీ అధిష్ఠానం పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొని, ఆవేశంతో ముందుకెళ్లే యువత, కార్యకర్తలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ   సీనియర్ కార్యకర్త, బ్రాహ్మణ చైతన్య వేదిక నిర్వాహకుడు సిరిపురం శ్రీధర్  పార్టీ కోసం చేసిన ఉద్యమాల్లో భాగంగా తనపై గతంలో దాదాపు 20 కి పైగా రాజకీయ కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఒకసారి కేసుల్లో ఇరుక్కున్న తర్వాత సమాజంలో, కుటుంబంలో ఎదురయ్యే అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు వర్ణనాతీతమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసుల విచారణ కోసం కోర్టులకు ఫీజులు చెల్లించలేక, చివరకు తల్లిదండ్రుల దగ్గర అడుక్కుని లేదా అప్పులు చేయాల్సిన దుస్థితి కార్యకర్తలకు వస్తోందని పేర్కొన్నారు. నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ  అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప,   లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.  ప్రతి రాజకీయ పార్టీలోనూ నిజమైన ఉద్యమ స్ఫూర్తితో పనిచేసేవాళ్లు వేళ్ల మీద లెక్కపెట్టేంత మందే ఉంటారన్న ఆయన మిగిలిన వారంతా కేవలం టీవీల్లో, ఫొటోల్లో కనిపించాలనే  బ్యాచ్ మాత్రమే అని శ్రీధర్ చెప్పారు.  వ్యక్తిగత ఆస్తుల గొడవలు లేదా సంఘవిద్రోహ చర్యల వల్ల వచ్చే కేసుల గురించి తాను మాట్లాడటం లేదని..  కేవలం పార్టీ పిలుపు మేరకు ఉద్యమాల్లో పాల్గొని అన్యాయంగా జీవితాలను నాశనం చేసుకుంటున్న జెన్యూన్ కార్యకర్తల కోణంలోనే ఈ వాదన  వినిపిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఏదో ఒక రాజకీయ పార్టీని తక్కువ చేయడం తన ఉద్దేశం కాదని, ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలలోనూ ఇదే పంథా నడుస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కార్యకర్తలను వాడుకోవడం, ఆపై కేసులు కాగానే వదిలేయడం అనే సంస్కృతి మారాలని శ్రీధర్ అభిప్రాయపడ్డారు. యువత రాజకీయ ఆవేశంలో ఊగిపోయి వివాదాల్లో చిక్కుకోకుండా, కేసులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని హితవు పలికారు.   Siripuram Sridhar Interview, Political Party Workers Cases, TDP Leader Sensational Comments, Political Cases On Youth, Tone News Telugu, AP Politics Reality
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్  యూట్యూబర్ బచ్చలకూరి జోసఫ్ అలియాస్  ప్రశ్న రావణ్  అరెస్టు,  ఆయనపై నమోదైన సెక్షన్ల వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశించి సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో గన్నవరం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే..  ఈ కేసులో సాధారణ  సెక్షన్లతో పాటు కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద నిరోధక చర్యల కోసం ప్రయోగించే అత్యంత కఠినమైన చట్టం  ఉపా  అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ సెక్షన్ 39ను కూడా చేర్చడం తీవ్ర చర్చకు దారితీసింది.  ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు,  ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ  తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు. సాధారణంగా దేశద్రోహ శక్తులు, ఉగ్రవాద ముఠాలతో సంబంధాలు ఉన్నవారిపై ప్రయోగించే ఈ చట్టాన్ని ఒక యూట్యూబర్‌పై ప్రయోగించడం వెనుక ఉన్న న్యాయపరమైన సాధ్యాసాధ్యాలను ఆయన  వివరించారు.  మాజీ జడ్జి రామకృష్ణ విశ్లేషణ ప్రకారం.. ఉపా  చట్టం కింద కేసు నమోదైతే నిందితుడికి సాధారణ కోర్టుల్లో అంత సులభంగా ఉపశమనం లభించదు. ఈ చట్టం పరిధిలోకి వచ్చే కేసులను ఎన్ఐఏ  ప్రత్యేక  కోర్టులు లేదా హైకోర్టులు మాత్రమే విచారిస్తాయి. అంతే కాకుండా, ఈ చట్టం కింద నమోదైన సెక్షన్ల ప్రకారం నిందితుడికి త్వరగా బెయిల్ వచ్చే అవకాశం ఉండదు.  విచారణ ప్రక్రియ చాలా సుదీర్ఘంగా సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. రావణ్ కేసులో కేవలం దూషణలు, రాజకీయ విమర్శలే కాకుండా ఉపా చట్టం పరిధిలోకి వచ్చే వ్యూహాత్మక అంశాలు లేదా ఆడియో క్లిప్పింగుల ఆధారంగా పోలీసులు బలమైన సాక్ష్యాలను సిద్ధం చేసి ఉంటారని   అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఈ సెక్షన్లను ఉన్నతాధికారులు,  న్యాయస్థానాలు ప్రాథమికంగా అంగీకరిస్తే.. రావణ్‌ను ఈ కేసుల నుండి రక్షించడం చట్టపరంగా చాలా కష్టమైన విషయమని మాజీ న్యాయమూర్తి   చెప్పారు.  రాజకీయ విమర్శలు, సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించే హక్కు అందరికీ ఉన్నప్పటికీ..  మాట్లాడే భాష చట్టపరిధిని దాటినప్పుడు ఇలాంటి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రామకృష్ణ అన్నారు.  ఇప్పటికే రాష్ట్రంలో ఈ కేసు చుట్టూ తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. ప్రజాస్వామ్యవాదులు, ప్రతిపక్షాలు ఈ చట్టం ప్రయోగాన్ని కక్షసాధింపుగా అభివర్ణిస్తుండగా..  చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా శిక్షార్హులేనని అధికార పక్షం వాదిస్తోంది.   పూర్తి ఇంటర్వ్యూ తెలుగువన్ చానల్ లో వీక్షించండి Former Judge Ramakrishna Legal Analysis, Andhra Pradesh Police Ravan Arrest, Chandrababu Pawan Kalyan YouTuber Case, AP Politics Social Media Arrests    
తెలంగాణ రాజకీయాలలో పరిచయం అక్కర్లేని పేరు... విలక్షణ శైలి, వినూత్న వాగ్ధాటితో నిత్యం వార్తల్లో ఉండే బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ నాయకుడు ఛామకూర మల్లారెడ్డి కారు దిగేస్తున్నారా?  రాజకీయంగా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? అంటే.. తాజా రాజకీయ పరిణామాలను గమనించిన వారు ఔననే అంటున్నారు.    2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి  ఓటమి పాలైనప్పటి నుండి, ఆ పార్టీ రాష్ట్రంలో తన ఉనికిని కాపాడుకోవడానికి, క్యాడర్‌ను నిలబెట్టుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ..  సీనియర్ నేతలు ఒకరి తరువాత ఒకరు అన్నట్లుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పుడా బాటలో చామకూర మల్లారెడ్డి కూడా నడుస్తున్నారా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.  ఇందుకు ఆయన మాటలు బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల    ఒక   వేడుకలో పాల్గొన్న చామకూర మల్లారెడ్డి..  తాను బీఆర్‌ఎస్ పార్టీకి క్రమంగా దూరమవున్నానని బాహాటంగానే అఅంగీకరించారు. తాను పార్టీకి కాస్త దూరం కాగానే, బీఆర్‌ఎస్ కార్యకర్తలు, సొంత మద్దతుదారులు తనను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించారన్న ఆవేదనను ఆ సందర్భంగా వ్యక్త పరిచారు. తాను బీఆర్ఎస్ కు దూరం జరగడం ప్రారంభించి కొన్ని రోజులే  అయినప్పటికీ.. అప్పుడే.. తన మద్దతుదారులు తనను ఏకాకిని చేసేయడం మొదలెట్టారనీ మల్లారెడ్డి ఒకింత భావోద్వేగ స్వరంతో చెప్పారు. ఆయన భావోద్వేగాలు, ఆవేదన కాసేపు పక్కన పెడితే.. మల్లారెడ్డి మాటలను బట్టే ఆయన బీఆర్ఎస్ కు దూరమౌతున్నారని అవగతమౌతోంది. ఆయన కారు దిగేయడానికి ఇంకెన్నో రోజులు పట్టకపోవచ్చునని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఆయన చెప్పడం సరే.. వాస్తవానికి గత కొంత కాలంగా మల్లారెడ్డి బీఆర్ఎస్ తో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలకూ, సమావేశాలకూ ఆయన గైర్హాజరౌతున్నారు. దీంతో మల్లారెడ్డి స్వయంగా తాను బీఆర్ఎస్ కు దూరం అవుతున్నానని చెప్పడానికి చాలా రోజుల ముందు నేంచే మల్లారెడ్డి పార్టీ మార్పుపై రాజకీయవర్గాలలో చర్చ జోరందుకుంది.  ఇక ఇప్పుడు ఆయన స్వయంగా పార్టీకి దూరం అవుతున్నానని బహిరంగంగానే చెప్పేయడంతో ఆయన ఏ పార్టీ గూటికి చేరుతారన్న ఆసక్తికర చర్చ మొదలైంది.  ఈ నేపథ్యంలోనే ఆయనకు కాంగ్రెస్ లో చేరే అవకాశాలు దాదాపు మృగ్యమనీ, చేరితే గీరితే ఆయన కాషాయం గూటికే చేరాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతే కాకుండా గత కొంత కాలంగా ఆయన బీజేపీ అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ, వారితో టచ్ లో ఉంటున్నారని విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.   BRS Party, Telangana Politics, Revanth Reddy, BJP Telangana, Malla Reddy Leaving BRS, Teluguone
ఎన్నికల వ్యూహకర్తగా ఇండియన్ పోలిటికల్ ఫీల్డ్ లో  ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే.. ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో దిగనున్నారు. సొంతంగా జన్ సూరజ్ పార్టీ  స్థాపించి ఇటీవలి బీహార్ ఎన్నికలలో ఘోరంగా విఫలమైన ప్రశాంత్ కిశోర్.. ఆ ఎన్నికలలో  తాను బరిలోకి దిగలేదు కానీ.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలోనూ తన పార్టీ అభ్యర్థులను రంగంలోకి దింపారు. అయితే ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు.  తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో  ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా    ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.   బీహార్‌లోని అ ప్రతిష్టాత్మక బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల 30న జరగనున్న ఉప ఎన్నికలో తాను బరిలోకి దిగి పోటీ చేయనున్నట్లు ప్రశాంత్ కిశోర్ స్వయంగా చెప్పారు.  పాట్నాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రశాంత్ కిశోర్ ఈ విషయాన్ని వెల్లడించారు.  బంకీపూర్..   2006  నుండి ఈ స్థానం నుంచి బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఈ స్థానం నుంచి   బీజేపీ సీనియర్ నేత నితిన్ నబీన్ విజయం సాధించారు. అయితే  ఆ తరువాత  అంటే ఈ ఏడాది ఏప్రిల్ లో  రాజ్యసభకు ఎన్నికయ్యారు. దాంతో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. నితిన్ నబీన్ రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఈ నెల 30న ఉప ఎన్నిక జరగనుంది.  రెండు దశాబ్దాలుగా బీజేపీకి   కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ప్రశాంత్ కిశోర్ నిర్ణయించుకున్నారు.   కాగా తన పోటీ విషయాన్ని ప్రకటించిన మీడియా సమావేశంలోనే.. ప్రశాంత్ కిశోర్ ఈ ఉప ఎన్నిక రాష్ట్రంలోని బీజేపీ సర్కార్ కు రెఫరెండంగా అభివర్ణించారు. మార్పు కోరుతూ తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. అంతే కాకుండా.. ఈ ఉప ఎన్నికలో తనకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్, ఆర్జేడీలను సైతం ప్రశాంత్ కిశోర్ కోరారు. అవపకమైతే అధికార బీజేపీని తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతానని ప్రశాంత్ కిశోర్ అన్నారు.  అయితే బంకీపూర్ స్థానం నుంచి బరిలోకి దిగుతామని ఆర్జేడీ ఇప్పటికే ప్రకటించింది. ఇక బీజేపీ సొంత స్థానం అయిన బకీంపూర్ ను ప్రశాంత్ కిశోర్ కు మద్దతు ఇచ్చి వదులుకునే అవకాశాలు ఇసుమంతైనా లేవు. ఈ పరిస్థితుల్లోబంకీపూర్ లో ప్రశాంత్ కిశోర్ ఏ మేరకు రాణిస్తారన్న విషయంపై రాజకీయవర్గాలు పెదవి విరుస్తున్నాయి.   Bankipur by election, Jan Suraaj Party, Bihar politics, Nitin Nabin
ALSO ON TELUGUONE N E W S
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ పేరు వింటేనే బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత గుర్తొస్తుంది. షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా ఆయన తెరకెక్కించిన 'జవాన్' చిత్రం ఏకంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, అట్లీని తిరుగులేని పాన్ ఇండియా సంచలనంగా మార్చేసింది. అంతకుముందు దళపతి విజయ్‌తో ఆయన రూపొందించిన బిగిల్, మెర్సల్, తేరి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద 100 శాతానికి పైగా భారీ విజయాలను నమోదు చేశాయి. ఇలాంటి బ్లాక్‌బస్టర్ హిట్ల ట్రాక్ రికార్డ్ ఉన్న దర్శకుడు అట్లీ నుంచి సినిమా వస్తోందంటేనే యావత్ భారత చిత్ర పరిశ్రమలో అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి.  ప్రస్తుతం అట్లీ టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో అత్యంత ప్రతిష్టాత్మకమైన పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'రాకా' సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు మాస్ పల్స్ తెలిసిన స్టార్స్ కలిసి చేస్తున్న ఈ చిత్రం కచ్చితంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని అటు అభిమానులు, ఇటు మీడియా వర్గాలు చాలా నమ్మకంగా చెబుతున్నాయి. ఇప్పటికే 'రాకా' చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ ప్రేక్షకుల్లో భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. అయితే ఈ సినిమా విడుదలకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల నుంచి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ వినిపిస్తోంది. రాకా చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను వచ్చే ఏడాది అంటే 2027 ఆరంభంలోనే పూర్తి చేయాలని దర్శకుడు అట్లీ ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత ఈ సినిమాకు అత్యంత కీలకమైన వీఎఫ్ఎక్స్ (VFX) పనుల కోసం ఏకంగా 10 నెలల పాటు భారీ సమయాన్ని కేటాయించబోతున్నారు. అంటే దాదాపు 10 నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిపి, 2027 చివరి నాటికి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావాలని చిత్ర యూనిట్ గట్టి పట్టుదలగా ఉంది. అయితే 'రాకా' తర్వాత అట్లీ చేయబోయే తదుపరి ప్రాజెక్ట్ ఏంటి అనే అంశంపై ఇండస్ట్రీలో ఇప్పుడే చర్చలు జోరందుకున్నాయి.  అట్లీ మైండ్‌లో ప్రస్తుతం 'జవాన్ 2' స్క్రిప్ట్ చర్చలతో పాటు, కమల్ హాసన్ మరియు సల్మాన్ ఖాన్‌ల కోసం రెడీ చేసిన భారీ మల్టీస్టారర్ స్టోరీ లైన్ కూడా ఉంది. ఈ కథల స్క్రిప్ట్ వర్క్ పూర్తి కావడానికి చాలా సమయం పడుతుందని టాక్. ఈ గ్యాప్‌లోనే అట్లీ మళ్లీ టాలీవుడ్ వైపే అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్‌తో అట్లీ ఒక భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నారనే ప్రచారం ఫిలిం నగర్ సర్కిల్స్‌లో విపరీతంగా ఊపందుకుంది. నిజానికి అల్లు అర్జున్‌తో 'రాకా' సినిమా సెట్ కాకముందే.. ఎన్టీఆర్‌తో అట్లీ సినిమా దాదాపు ఖరారైందని, వీరిద్దరి మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అట్లీ సన్నిహిత వర్గాలు చెబుతుంటాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. దేవర సిరీస్, వార్ 2 చిత్రాల అనంతరం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' సినిమా చేయనున్నారు.  ఆ ప్రాజెక్ట్ ముగిసిన తర్వాత ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమాపై ఇంకా ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు. సరిగ్గా ఇదే సమయంలో ఎన్టీఆర్-అట్లీ కాంబినేషన్ తెరపైకి రావడం విశేషం. అంతా అనుకున్నట్లు జరిగితే.. 2028 ఆరంభంలో ఈ క్రేజీ కాంబో ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ టాక్. షూటింగ్ పూర్తి చేసుకుని దాదాపు రెండేళ్ల తర్వాత అంటే 2030 నాటికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా అట్లీ టీమ్ ఒక పక్కా ప్లాన్‌ను సిద్ధం చేస్తోందట. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో చేస్తున్న 'రాకా' సినిమా గనుక బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సూపర్ హిట్ అయితే.. టాలీవుడ్‌లోని టాప్ స్టార్ హీరోలంతా అట్లీతో వర్క్ చేయడానికి క్యూ కట్టడం ఖాయం. కానీ అట్లీ మాత్రం ఇప్పటికే ఎన్టీఆర్‌కు ఇచ్చిన మాట ప్రకారం, మరో హీరోతో కమిట్ అవ్వకుండా తారక్‌తోనే తన తదుపరి సినిమాను పట్టాలెక్కించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ భారీ కాంబినేషన్‌పై అట్లీ టీమ్ ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక క్లూస్ ఇవ్వడం లేదు.  సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కేవలం పుకార్లే అని కొట్టిపారేస్తున్నప్పటికీ, నందమూరి అభిమానులు మాత్రం ఈ కాంబో వందకు వంద శాతం నిజం కావాలని బలంగా కోరుకుంటున్నారు. ఒకవేళ ఎన్టీఆర్-అట్లీ కాంబినేషన్ సెట్ అయితే గనుక బాక్సాఫీస్ వద్ద రికార్డుల ఊచకోత ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ఎన్టీఆర్ లేదా అట్లీ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి!       ntr, atlee, allu arjun, raaka
Raja The Raja trailer has arrived, giving audiences a better look at what appears to be one of the more unconventional concepts among upcoming Telugu films. Starring debutant Ruthvik and Vishakha Dhiman in the lead roles, the film intertwines two timelines—one set in the past and the other in the present—while building intrigue around how they eventually connect. The trailer introduces Ruthvik in two contrasting avatars. In the historical timeline, he plays a young prince deeply in love, with Sai Kumar portraying a king who is prepared to banish him as his decisions begin affecting the kingdom. In the present, Ruthvik is seen as a cheerful youngster who dreams of becoming a fashion designer, hiding his passion from his father, played by Naresh, who wants him to pursue medicine instead. The narrative gradually hints at a mysterious link between the two worlds through a gold coin, leaving the audience guessing about how the past and present collide. Director Anil Boyiidapu seems to have built the film around this central mystery while balancing romance, emotions, humour and fantasy elements. For a newcomer, Ruthvik appears confident in handling two distinctly different characters, while Vishakha Dhiman looks convincing in both the princess and modern-day fashion model roles. The trailer also stands out for its vibrant visuals and production design, particularly in the period portions, giving the film a scale beyond its budget. Produced by Niharika Dasari, Raja The Raja looks to offer a fresh cinematic experience by blending youthful entertainment with an intriguing fantasy-driven narrative. The trailer succeeds in raising curiosity about the mystery connecting its two timelines, making the film one to watch out for. Mythri Movie Makers are distributing the film locked for 17th July release.  Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక సంచలన కాంబినేషన్ గురించిన చర్చ జోరుగా సాగుతోంది. వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద తిరుగులేని ఫామ్‌లో ఉన్న నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. కెరీర్ ఆరంభంలో వరుసగా 4 బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో టాలీవుడ్‌ను శాసించిన కొరటాల శివకు, ఆ తర్వాత వచ్చిన 'ఆచార్య', 'దేవర' చిత్రాలు ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేదు.  ముఖ్యంగా 'దేవర' పార్ట్ 1 నిరాశపరచడంతో కొరటాల శివ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఎన్టీఆర్‌తో 'దేవర' పార్ట్ 2 చేయాల్సి ఉన్నప్పటికీ, తారక్ తన ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం, అలాగే పార్ట్ 1 ఫలితం వల్ల కొరటాల శివ ఇప్పట్లో మెగాఫోన్ పట్టడం కష్టమేనని ఇండస్ట్రీ విశ్లేషకులు భావించారు. కానీ ఇలాంటి క్లిష్ట సమయంలో నందమూరి బాలకృష్ణ ఆయనకు ఊహించని విధంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పెద్ద బూస్ట్ ఇచ్చారు. బాలయ్యలాంటి మాస్ హీరో ఈ క్రేజీ కాంబినేషన్‌కు ఓకే చెప్పడం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్యేగా నిరంతరం ప్రజాసేవలో బిజీగా గడుపుతున్నప్పటికీ, బాలకృష్ణ సినిమాలకు ఎక్కడా బ్రేక్ పడకుండా వరుసగా డేట్లు కేటాయిస్తూ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ క్రమంలోనే కొరటాల శివ ప్రాజెక్ట్ కోసం బాలయ్య ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ వేగాన్ని పెంచేందుకు రాబోయే ఆగస్టు నెల మొత్తాన్ని (దాదాపు 30 రోజులు) పూర్తిగా కొరటాల శివకే కేటాయించారట.  ఈ ఆగస్టు షెడ్యూల్‌లోనే సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్‌తో పాటు మెజార్టీ షూటింగ్‌ను కంప్లీట్ చేయాలనే పక్కా ప్రణాళికతో కొరటాల శివ ఉన్నట్లు సమాచారం. ఆచార్య, దేవర చిత్రాల ఫలితాల తర్వాత కొరటాల శివ ఈసారి ఏమాత్రం తప్పులు దొర్లకుండా ప్రతి విషయంలోనూ తీవ్ర జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాలకృష్ణతో సినిమా చేసేటప్పుడు దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందనే పేరు ఇండస్ట్రీలో ఉంది. ఈ గోల్డెన్ ఛాన్స్‌ను ఉపయోగించుకుని కొరటాల శివ తన పాత సక్సెస్ ట్రాక్‌ను మళ్లీ రీక్రియేట్ చేయాలని పట్టుదలతో ఉన్నారు. కొరటాల శివ గత చిత్రాలను పరిశీలిస్తే హీరో పాత్రలు మరీ ఊర మాస్ లాగా కాకుండా, క్లాస్ టచ్‌తో చాలా సెటిల్డ్‌గా, మోడరేట్ తరహాలో ఉంటాయి. ఇప్పుడు బాలకృష్ణను కూడా అదే తరహా సరికొత్త లుక్‌లో చూపించబోతున్నారట. బాలయ్య మార్క్ పవర్‌ఫుల్ మేనరిజమ్స్, గెటప్స్ కోరుకునే అభిమానుల కోసం కథలో అవసరమైన చోట హీరోయిజాన్ని నెక్స్ట్ లెవెల్‌లో ఎలివేట్ చేస్తూ, ఫ్యాన్స్‌కు 'ఫుల్ మీల్స్' లాంటి సినిమా ఇచ్చేందుకు కొరటాల ఏకంగా 4 నెలల పాటు స్క్రిప్ట్ వర్క్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మాస్ అవతార్‌లోనే కనిపిస్తూనే బాలయ్య క్యారెక్టర్ ఎంతో హుందాగా, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సాగుతుందని టాక్.      Nandamuri Balakrishna, Koratala Siva, NBK, Devara Part 2, Tollywood Movie News
    కేజీఎఫ్' తో పాన్ ఇండియా రేంజ్‌లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న రాకింగ్ స్టార్ యష్(yash)తాజా చిత్రం 'టాక్సిక్' (Toxic). గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో సుమారు 600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన లేడీస్ టీజర్ మరియు విడుదల తేదీ అధికారిక ప్రకటన వెలువడినప్పటి నుండి సోషల్ మీడియాలో నెగెటివిటీ, వివాదాలు చుట్టుముట్టాయి. యాక్షన్ కంటెంట్ ఆశించిన అభిమానులకి  టీజర్‌లో కనిపించిన మితిమీరిన రొమాంటిక్, బోల్డ్ సీన్స్ తీవ్ర నిరాశని  మిగిల్చాయి.  నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ లాంటి భారీ తారాగణం ఉన్నప్పటికీ, విజువల్స్ కాస్త శృతిమించినట్టు ఉన్నాయంటూ నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.  ఈ క్రమంలోనే నెటిజన్లు యష్ గతంలో చేసిన ఒక సంచలన వ్యాఖ్యానాన్ని తెరపైకి తెచ్చి ట్రోల్ చేస్తున్నారు. కెరీర్ ప్రారంభంలో ఒక టాక్ షోలో యష్ మాట్లాడుతూ, "నేను నా తల్లిదండ్రులతో కలిసి కూర్చుని చూడలేని ఏ ఒక్క సీన్ కూడా సినిమాలో చేయను, అది నా సిద్ధాంతం. ఒకప్పుడు రొమాంటిక్ సీన్స్ చేయాలంటేనే ఎంతో సిగ్గుపడేవాడిని, హెల్మెట్ పెట్టుకుని పార్కుల్లో ప్రేమికులని  గమనించి నటన నేర్చుకున్నానని కూడా నవ్వుతూ పంచుకున్నారు. కానీ ఇప్పుడు 'టాక్సిక్' సినిమాలో ఏకంగా సెన్సువల్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో, "ఆనాడు చెప్పిన మాటలు ఏమయ్యాయి యష్? మీ పాత ఒట్టును మీరే మర్చిపోయారా?" అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు.ఈ తీవ్రమైన ట్రోలింగ్ మరియు వివాదాలపై చిత్ర కథానాయిక హుమా ఖురేషి తాజాగా స్పందించారు. నెటిజన్లు కాస్త ఓపిక పట్టాలని, సినిమా ఇంకా ఎవరూ చూడలేదు కాబట్టి అప్పుడే ఒక అంచనాకు రావడం తగదని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా, సాధారణంగా పెద్ద స్టార్ హీరోలు మహిళా దర్శకుల మాట వినడానికి ఇష్టపడరని, కానీ యష్ మాత్రం గీతూ మోహన్ దాస్ ప్రతిభను నమ్మి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని ప్రశంసించారు. మరోవైపు, ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతుండటంతో కొన్ని అభ్యంతరకర విజువల్స్‌పై ఇప్పటికే కర్ణాటక మహిళా కమిషన్ మరియు సెన్సార్ బోర్డ్‌కు ఫిర్యాదులు కూడా అందాయి. ఎన్నో వాయిదాల తర్వాత, మిడిల్ ఈస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఇబ్బందులను దాటుకుని ఈ చిత్రం ఎట్టకేలకు ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. yash, toxic, geethumohandas  
చరిత్ర ఎందరో వీరులను మనకు పరిచయం చేసింది. కానీ, దేశం కోసం, సాంకేతిక ప్రగతి కోసం అహర్నిశలు శ్రమించి కూడా కాలగర్భంలో కలిసిపోయిన అద్భుత మేధావులు కొందరు ఉంటారు. అలాంటి వారిలో కోయంబత్తూరులో జన్మించిన తెలుగు కుటుంబానికి చెందిన జీడీ నాయుడు (గోపాలస్వామి దొరస్వామి నాయుడు) అగ్రగణ్యుడు. ఆయన కేవలం ఒక వ్యాపారవేత్త మాత్రమే కాదు.. భారతదేశపు ఎడిసన్‌గా కీర్తించబడిన గొప్ప ఆవిష్కర్త. బ్రిటీష్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఒక తిరుగులేని శక్తి ఆయన. ఆయన జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'జి.డి.ఎన్' (G.D.N). తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, సత్యరాజ్, జయరామ్, ప్రియమణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీడీ నాయుడు యునైటెడ్ మోటార్స్ సర్వీస్ (UMS) ద్వారా రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. ఆయన వ్యాపార పుస్తకాలు ఎంతో స్వచ్ఛంగా, చట్టబద్ధంగా ఉండేవి. ఆయన ఎదుగుదలను తట్టుకోలేని బ్రిటీష్ అధికారులు ఆయనను ఎలాగైనా ఇరికించాలని చూశారు. "ఆయన పుస్తకాలు క్లీన్‌గా ఉంటే.. వాటిని మీరే మురికి చేయండి" అని బ్రిటీష్ పైఅధికారులు ఆదేశించారంటే ఆయన నిజాయితీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆ కాలంలోనే ఆయన జర్మనీ, నాజీలతో వ్యాపార సంబంధాలు నెరిపారు. ఇది బ్రిటీష్ కిరీటానికి వ్యతిరేకంగా చేసిన దేశద్రోహంగా భావించి బ్రిటీష్ ప్రభుత్వం ఆయనపై నిఘా పెట్టింది. బ్రిటీష్ వారే కాదు, మన దేశంలోని కొందరు స్వార్థపరులు కూడా ఆయనకు శత్రువులుగా మారారు. సరిగ్గా ఆ సమయంలోనే బ్రిటీష్ ప్రభుత్వం నాయుడుపై పన్నుల పేరుతో వేధింపులకు దిగింది. ఆయనపై అన్యాయంగా పన్నులు విధించినప్పుడే, ఆయన బ్రిటీష్ వ్యవస్థను ఎదురించి గళమెత్తారు. బ్రిటీష్ వారు ఆయన ఆస్తిలో ఏకంగా 80 శాతం జప్తు చేయడానికి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ, జీడీ నాయుడు సామాన్యుడు కాదు. ఆత్మాభిమానం కలిగిన ఆ మేధావి, బ్రిటీష్ వారికి తలవంచలేదు. తాను కష్టపడి కనిపెట్టిన అద్భుతమైన యంత్రాలను, సాంకేతిక పరికరాలను బ్రిటీష్ వారి చేతికి చిక్కకుండా తన చేతులతోనే పగులగొట్టి ధ్వంసం చేశారు. గోవింద్ వసంత అద్భుతమైన సంగీతం, కృష్ణకుమార్ రామకుమార్ లీడ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ 'జి.డి.ఎన్' చిత్రం, చరిత్ర మరిచిన ఒక మహోన్నత భారతీయుడి కథను ప్రపంచానికి చాటిచెప్పబోతోంది. బ్రిటీష్ వారిని భయపెట్టి, సొంత దేశస్థులచే విస్మరించబడిన ఈ వీరుడి గాథ ప్రతి ఒక్కరిలో దేశభక్తిని, స్ఫూర్తిని నింపుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. GDN Trailer, GD Naidu, R Madhavan, TeluguOne  
హైదరాబాద్‌ నగరానికి ఒక ప్రత్యేకమైన కల్చర్ ఉంది. ఇక్కడి బస్తీల్లో ఉండే కుర్రాళ్ల లైఫ్ స్టైల్, వారు మాట్లాడే యాస, వారి ఆలోచనలు ఎప్పుడూ డిఫరెంట్‌గా ఉంటాయి. సరిగ్గా ఇదే కాన్సెప్ట్‌ను బేస్ చేసుకుని, పక్కా లోకల్ హైదరాబాదీ ఫ్లేవర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది 'అమీర్ లోగ్' (Ameer Log) చిత్రం. రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా ద్వారా ఈ సినిమా రిలీజ్ అవుతుండటం విశేషం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ టీజర్ విడుదలై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.  ఈ సినిమా టీజర్ చూస్తుంటే, ఇదొక ఫుల్ లెంగ్త్ మాస్, ఎంటర్‌టైనింగ్, యూత్‌ఫుల్ డ్రామా అని స్పష్టంగా అర్థమవుతోంది. 1 నిమిషం 57 సెకన్ల నిడివి గల ఈ టీజర్, మొదటి సెకను నుంచే తనదైన హైదరాబాదీ రాపోతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. నగరంలోని లోకల్ బస్తీ వాతావరణం, అక్కడి కుర్రాళ్ల జీవన విధానాన్ని చాలా సహజంగా స్క్రీన్‌పై ఆవిష్కరించినట్లు కనిపిస్తోంది. టీజర్ లోని ప్రతి డైలాగ్, ప్రతి సీన్ చాలా క్యాచీగా ఉంది. ముఖ్యంగా "పదిహేను వందల జూతా.. ఇజ్జత్‌పై వస్తే జబ్డాపై ఖాతా" అంటూ సాగే రాప్ లిరిక్స్, అలాగే డైలాగ్స్ కుర్రాళ్లకు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. హైదరాబాద్ సిటీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో కేవలం మాస్ మాత్రమే కాదు, ఈ తరం యువత మైండ్‌సెట్ ఎలా ఉందో కూడా చూపించబోతున్నారు. "మన హైదరాబాద్‌లో బండి నడపడం నేర్చుకుంటే, దునియాలో ఎక్కడైనా నడపొచ్చు" అనే డైలాగ్ నగరవాసులను అమితంగా ఆకట్టుకుంటోంది. బిర్యానీ తినడం, ప్రశాంతంగా పడుకోవడం, బస్తీ దోస్తీలతో ముచ్చట్లు పెట్టడం, ప్రేమ వ్యవహారాలు.. ఇలా ఒక మిడిల్ క్లాస్ హైదరాబాదీ కుర్రాడి లైఫ్‌లో ఉండే అన్ని ఎమోషన్స్‌ను ఈ సినిమాలో పక్కాగా మిక్స్ చేశారు. రమణ రెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎంసి హరి, వేధ జలంధర్, మనోజ్, శశిధర్ వంటి యువ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టీజర్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రాప్ సాంగ్స్ విజువల్స్‌కు పర్ఫెక్ట్‌గా సింక్ అయ్యాయి. రానా దగ్గుబాటి ఈ చిన్న సినిమాను సపోర్ట్ చేయడంతో 'అమీర్ లోగ్' ప్రాజెక్ట్‌పై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఖచ్చితంగా థియేటర్లలో ప్రేక్షకులకు ఒక సరికొత్త లోకల్ రైడ్‌ను అందిస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.      Ameer Log Teaser, Rana Daggubati, Hyderabad, TeluguOne  
టాలీవుడ్‌లో విలక్షణమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు తిరువీర్, విలక్షణ నటి ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘ఓ సుకుమారి’. పల్లెటూరి నేపథ్యంతో సాగే ఒక అందమైన, విభిన్నమైన ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. సినిమాను వీక్షించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సభ్యులు ఈ చిత్రానికి క్లీన్ యూ/ఏ (U/A) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. సెన్సార్ బోర్డు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి ముస్తాబవుతోంది. ఫాంటసీ అంశాలతో కూడిన ఒక వినూత్నమైన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాతో భరత్ దర్శన్ దర్శకుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత మహేశ్వర రెడ్డి మూలి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఒక పక్కా వినోదాత్మక చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాను ఈ నెలలోనే భారీ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా జులై 17వ తేదీన ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా కథాంశం చాలా ఆసక్తికరంగా, విభిన్నమైన మలుపులతో సాగనుంది. రాజకీయ నాయకుడు కావాలని కలలు కనే ఒక సాధారణ యువకుడు, సుకుమారి అనే ఒక అమాయకపు పల్లెటూరి అమ్మాయి ప్రేమలో పడతాడు. అయితే ఇక్కడే కథలో ఊహించని ఒక పెద్ద ట్విస్ట్ ఎదురవుతుంది. అదేమిటంటే.. హీరోయిన్ సుకుమారిని ఎవరు తాకినా సరే వారికి గట్టిగా కరెంట్ షాక్ కొడుతుంది. ఈ విచిత్రమైన సమస్య చుట్టూ సాగే కథనం అత్యంత హాస్యభరితంగా, ఉత్కంఠభరితంగా ఉంటుందని దర్శకుడు చెప్తున్నారు. ఈ సరికొత్త పాయింట్ ప్రేక్షకులను ఆద్యంతం నవ్విస్తూనే, కథలో లీనమయ్యేలా చేస్తుందని చిత్ర యూనిట్ నమ్ముతోంది. ఇప్పటికే షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం శరవేగంగా పోస్ట్-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా నవ్వులు పూయించేందుకు సిద్ధమైన ఈ చిత్రాన్ని కేవలం తెలుగులోనే కాకుండా తమిళంతో పాటు ఇతర ప్రధాన భాషల్లోనూ ఒకేసారి గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సెన్సార్ బోర్డ్ నుంచి U/A సర్టిఫికెట్ రావడంతో, ఈ సినిమా ఖచ్చితంగా కుటుంబ సమేతంగా చూడదగ్గ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి అంచనాలు నెలకొన్నాయి. తిరువీర్ మార్క్ యాక్టింగ్, ఐశ్వర్య రాజేష్ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.       O Sukumari Movie, Thiruveer, Aishwarya Rajesh
Finally, after an eight-month-long wait, CM Vijay's Jana Nayagan appears to be heading towards its theatrical release. According to industry reports, KVN Productions recently held discussions with Tamil Nadu distributors and informed them that the makers are targeting July 23 as the film's release date, subject to the completion of the remaining CBFC formalities. During the meeting, distributors reportedly requested the producers to bear the interest rates charged by private financiers due to the prolonged delay. However, the KVN team is said to have maintained that they would compensate only at prevailing bank interest rates and not the higher financier rates. Sources add that the producers also told distributors that those unwilling to accept the revised terms could instead take back their original investment and opt out of releasing the film. The makers have also reportedly restructured the business model. Instead of proceeding with a Minimum Guarantee (MG) deal, KVN Productions is said to have opted for a distribution model, offering distributors an 8% commission. Consequently, the Tamil Nadu theatrical rights, earlier valued at around Rs.103 crore, have reportedly been revised to nearly Rs.90 crore. To reassure distributors, KVN Productions has also reportedly promised that any losses incurred on Jana Nayagan would be compensated through the theatrical rights of Toxic, starring Yash. These developments indicate that the film's long-pending censor issues have finally been resolved. Reports suggest that Jana Nayagan has been awarded an 'A' certificate, with the makers deciding not to pursue any further battle after portions of the film were allegedly leaked online. An official release date announcement is expected once the physical certificate is received from the CBFC. Directed by H. Vinoth, Jana Nayagan stars Thalapathy Vijay alongside Pooja Hegde, Mamitha Baiju, and Bobby Deol, with music composed by Anirudh Ravichander. The film has also been widely reported to be the remake of Bhagavanth Kesari. If the film indeed arrives on July 23, it will finally conclude an eight-month struggle that began in December and cost it a Pongal release. More importantly, with Vijay already transistioning into full-time politics after this film, Jana Nayagan is expected to become one of the biggest celebrations of his career, drawing not just fans but general audiences eager to witness his final outing on the big screen. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  శ్రీలీల.. తనదైన పెర్ఫార్మ్, డ్యాన్సులతో షార్ట్ టైంలోనే  సెన్సేషనల్ బ్యూటీ గా మారింది..సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకెళ్తున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లోనే కాకుండా ఇతర భాషలపై కూడా గట్టిగానే కన్నేసింది. ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప 2: ది రూల్’ మూవీలోని స్పెషల్ సాంగ్‌తో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న శ్రీలీలకు బాలీవుడ్ నుండి భారీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అయితే బాలీవుడ్ సెల్యులాయిడ్ పై  పరిచయం కాబోతున్న క్రేజీ డెబ్యూ ప్లాన్స్‌లో ఇప్పుడు ఊహించని మలుపు చోటుచేసుకుంది. నిజానికి శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ అనగానే అందరి మైండ్‌లోనూ బాలీవుడ్ క్రేజీ హీరో కార్తీక్ ఆర్యన్ పేరే గుర్తొచ్చింది. ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్‌కి  జంటగా ‘ఆషికీ 3’ (అన్‌టైటిల్డ్ రొమాంటిక్ డ్రామా) చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించాల్సి ఉంది. ఫిబ్రవరి 2025లోనే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా అధికారికంగా విడుదలైంది. అయితే, పలు కారణాల వల్ల ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చాలా కాలంగా ఆలస్యమవుతూ వస్తోంది. సినిమా ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం షూటింగ్ అనుకున్న సమయానికి ప్రారంభం కాకపోవడం మరియు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉండటంతో, శ్రీలీల బాలీవుడ్ వ్యూహాన్ని పూర్తిగా మార్చాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే శ్రీలీల బాలీవుడ్‌లో ఒక బిగ్ రిస్క్ తీసుకోబోతోందనే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. హిట్ ట్రాక్‌లో ఉన్న స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ సినిమా ఆలస్యం కావడంతో, ఆమె బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కొడుకు, ఇబ్రహీం అలీ ఖాన్ సరసన ఒక సరికొత్త రొమాంటిక్ డ్రామాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా టాక్. 'దిలేర్’ (Diler) అనే టైటిల్‌తో తెరకెక్కుతుండగా అగ్ర  నిర్మాణ సంస్థ మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై కునాల్ దేశ్‌ముఖ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. also read: ntr: లెనిన్ లో మాస్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గర్జన.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారంటీ అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఇబ్రహీం అలీ ఖాన్ ఇప్పటివరకు నటించిన ‘నదానియాన్’, ‘సర్జమీన్’ అనే రెండు సినిమాలు థియేటర్లలో విడుదల కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి. ఈ రెండు చిత్రాల్లోని ఇబ్రహీం అలీ  నటనపై ప్రేక్షకుల నుండి, సినీ విమర్శకుల నుండి తీవ్రమైన మిశ్రమ స్పందన రావడమే కాకుండా సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ కూడా ఎదురైంది. ఇలా విమర్శలు ఎదుర్కొంటున్న ఒక అప్ కమింగ్ హీరోతో శ్రీలీల తన మొదటి బాలీవుడ్ థియేట్రికల్ మూవీని ఓకే చేయడం ఒక పెద్ద సాహసమనే చెప్పాలి. ఒకవేళ కార్తీక్ ఆర్యన్ చిత్రం ముందుగా విడుదలయ్యుంటే శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీకి ఒక బలమైన పునాది పడేదని, కానీ ఇప్పుడు వరుస ట్రోలింగ్స్ ఎదుర్కొంటున్న ఇబ్రహీంతో ‘దిలేర్’ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం శ్రీలీల కెరీర్‌కి  ఎలాంటి మలుపు ఇస్తుందోనని ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందుతున్నారు.    sreeleela, Ibrahim Ali,  Kartik Aaryan
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దశాబ్దాలుగా నవ్వులు పూయిస్తూ, వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తున్న నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌కు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక 'పద్మశ్రీ' పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐదు తరాల నటీనటులతో కలిసి పనిచేసిన అరుదైన రికార్డు ఉన్న రాజేంద్ర ప్రసాద్, ఈ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఘనంగా అందుకున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా, మెగాస్టార్ చిరంజీవి గతంలో అవార్డులపై చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యల గురించి విలేకరులు ప్రశ్నించినప్పుడు, రాజేంద్ర ప్రసాద్ చాలా పరిణతితో, ఆచితూచి స్పందించారు. రామ్‌ చరణ్ నటనకు నేషనల్ అవార్డు వస్తుందని అందరూ అంటున్నారని చెప్పే క్రమంలో, "అవార్డులు రావడానికి ఎన్నో దారులు ఉంటాయి" అని చిరంజీవి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో ఇండస్ట్రీలో పెద్ద దుమారమే లేపాయి. ఈ అంశంపై రాజేంద్ర ప్రసాద్ స్పందిస్తూ, అసలు చిరంజీవి ఏ మూడ్‌లో, ఏ సందర్భంలో ఆ మాట అన్నారో తనకు పూర్తిగా తెలియదని అన్నారు. జీవితంలో ప్రతి విషయాన్ని ప్రతికూల లేదా నెగిటివ్ కోణంలోనే చూడాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు, ఇటీవల తాను తిరుమల నుంచి బయటకు వచ్చినప్పుడు, "ఈ పద్మశ్రీ అవార్డు నాకు ఆ వేంకటేశ్వరస్వామే ఇప్పించారు, నాకు అంత సీన్ ఎక్కడుంది" అని సరదాగా అంటే, కొందరు మీడియా ప్రతినిధులు దానికి వేరే అర్థాలు తీసి 'నాకు అంత సీన్ లేదు' అన్నట్టు హెడ్‌లైన్స్ పెట్టారని గుర్తుచేశారు. కాబట్టి, చిరంజీవి కూడా వేరే మంచి సందర్భంలోనే ఆ మాట అని ఉంటారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అయితే, అలా అని తాను చిరంజీవిని బ్లైండ్‌గా సపోర్ట్ చేస్తున్నానని ఎవరూ అనుకోవద్దని రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. ప్రతి మాటను ఒకే అర్థంతో తీసుకోవాల్సిన పని లేదని, అవార్డుల విషయంలో ఉత్తరాది, దక్షిణాది అనే తేడాలు, చర్చలు ఎప్పటి నుంచో నడుస్తున్నాయని ఒప్పుకున్నారు. దేశంలోనే అత్యున్నత స్థానాల్లో ఉన్నవారిలో చిరంజీవి ఒకరని, ఆయనకు ఇప్పటికే ఎన్నో బ్రహ్మాండమైన అవార్డులు వచ్చాయని, కాబట్టి ఇలాంటి చిన్న చిన్న వివాదాస్పద వ్యాఖ్యలను విన్న వెంటనే మర్చిపోవడమే మంచిదని నెటిజన్లకు, ప్రేక్షకులకు సూచించారు. ఇదే క్రమంలో అవార్డుల విలువ గురించి మాట్లాడుతూ ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పారు. "అవార్డులను మనం అడిగి తీసుకుంటే అది 'భిక్ష' అవుతుంది. అదే ప్రభుత్వం మన ప్రతిభను గుర్తించి పిలిచి ఇస్తేనే ఆ పురస్కారానికి అసలైన గౌరవం, నిజమైన విలువ ఉంటుంది" అని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. తనకు ఈ పద్మశ్రీ అవార్డు రావడం కొంచెం ఆలస్యమైందనే మాట వాస్తవమే అయినా, అదంతా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుందని, ఆ ప్రక్రియలో తాను వెనుకబడ్డానేమోనని వ్యాఖ్యానించారు.     Rajendra Prasad, Chiranjeevi, Rambantu Movie, Tollywood, Quick Gun Murugan
  నేటి కాలంలో, సంబంధాలు బలపడటానికి , విచ్ఛిన్నం కావడానికి కమ్యూనికేషన్ సరిగా లేకపోవడమే అతిపెద్ద కారణంగా మారింది. అది కుటుంబ సంబంధం అయినా, స్నేహ సంబంధం అయినా, లేదా మరేదైనా వ్యక్తిగత సంబంధం అయినా, ఒకరినొకరు సరైన విధంగా కమ్యూనికేట్ చేయడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలాముఖ్యం. నిజానికి చాలామంది రిలేషన్ లో ఉన్నప్పుడు  తమ మనసులో ఉన్న విషయాలను ఓపెన్ గా చెప్పడానికి ధైర్యం చేయరు. చాలా సందేహపడుతూ ఉంటారు. దీని వల్ల అపార్థాలు పెరిగి  రిలేషన్స్ లో దూరం ఏర్పడుతుంది. అందుకే రిలేషన్ లో ఉన్నప్పుడు ఓపెన్ గా మాట్లాడుకోవడం చాలా ముఖ్యం అంటుంటారు.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. నమ్మకాన్ని పెంచుతుంది.. చక్కగా, ఎలాంటి విమర్శలు లేకుండా ఓపెన్ గా మాట్లాడుకోవడం ఏ  సంబంధానికైనా బలమైన పునాది ఏర్పరుస్తుంది. రిలేషన్ లో ఉన్న వ్యక్తులు నిజాయితీగా మాట్లాడినప్పుడు, వారి మధ్య నమ్మకం దానంతట అదే పెరుగుతుంది. మంచి కమ్యూనికేషన్  వల్ల అవతలి వ్యక్తి మన మాటలను శ్రద్ధగా వింటున్నారని మనకు అనిపిస్తుంది. ఇది అపార్థాల అవకాశాన్ని తగ్గిస్తుంది , సంబంధాలు దీర్ఘకాలం పాటు బలంగా ఉండటానికి సహాయపడుతుంది.  కమ్యూనికేషన్ బలహీనంగా ఉంటే.. అనుమానం,  అపార్థాలు, దూరం పెరుగుతాయి. అపార్థాలు తొలగిస్తుంది.. రిలేషన్స్ లోని సమస్యలు చాలా వరకు పెద్ద కారణం వల్ల కాకుండా, చిన్న చిన్న అపార్థాల వల్ల తలెత్తుతాయి. సరైన సంభాషణ ద్వారా ఈ అపార్థాలను సులభంగా పరిష్కరించవచ్చు. ప్రజలు తమ ఆలోచనలను, భావాలను బహిరంగంగా మాట్లాడుకున్నప్పుడు, వారికి ఉండే  సందేహాలు తొలగిపోతాయి. ఇది సంబంధాలలో స్పష్టతను తీసుకువచ్చి, అనవసరమైన ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎమోషనల్ బాండింగ్.. కమ్యూనికేషన్ చేయడం అంటే కేవలం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడమే కాదు..  అది భావోద్వేగాలను వ్యక్తపరిచే ఒక మార్గం కూడా.   మనసులోని మాటలను పంచుకున్నప్పుడు ఇద్దరి మధ్య మరింత గాఢమైన భావోద్వేగ బంధం ఏర్పడుతుంది. ఇది ఒకరిలో ఒకరికి చెందిన ఫీలింగ్ ను పెంపొందించి, సంబంధాలను మరింత సన్నిహితంగా చేస్తుంది. ఈ అనుబంధమే ఏ సంబంధాన్నైనా ప్రత్యేకంగా నిలుపుతుంది. సమస్యల పరిష్కారం.. ప్రతి సంబంధంలో లేదా పరిస్థితిలో సమస్యలు సర్వసాధారణం, కానీ సరైన కమ్యూనికేషన్  ద్వారా వాటిని సులభంగా పరిష్కరించవచ్చు. ఇరు పక్షాలు తమ అభిప్రాయాలను ఓపెన్ గా వ్యక్తపరిచినప్పుడు, పరిష్కారాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కమ్యూనికేషన్ వల్ల  తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం తగ్గుతుంది.  ఇద్దరు వ్యక్తులు ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకు వెళ్లడానికి మార్గం కల్పిస్తుంది.  అందుకే ఓపెన్ గా మాట్లాడుకోవడం  అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. మానసిక ఒత్తిడి.. మనసులో భావాలను, ఆందోళనలను ఇతరులతో పంచుకున్నప్పుడు మనసు తేలికపడుతుంది. ఏ విషయాన్ని అయినా మనసులోనే దాచుకోవడం ఒత్తిడిని పెంచుతుంది, కానీ మాట్లాడటం ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది మానసిక ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. మంచి కమ్యూనికేషన్ ఒక వ్యక్తి మరింత ప్రశాంతంగా, సమతుల్యంగా , సంతోషంగా ఉండేలా చేస్తుంది.                                      *రూపశ్రీ.
చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం,  ఈర్ష్య,  అసూయ,  ఓర్చుకోలేని తత్వం ఇలాంటివన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటి వారిని చెడ్డవాళ్లుగా చెబుతూ ఉంటారు.  చాలా వరకు మనుషులు తాము మంచి వాళ్లని, చెడ్డ వాళ్లని బయటకు చెప్పుకోరు.  వారి ప్రవర్తనలో ఇది బయటపడుతూ ఉంటుంది.  ముఖ్యంగా కొందరు వ్యక్తులు మంచి వాళ్ల చుట్టూ చేరి తీయని మాటలతో మోసం చేయాలని చూస్తుంటారు.  వారు ఇలా మోసం చేస్తారని తెలుసుకోలేని పరిస్థితిలో కొందరు ఉంటారు.  తీయని మాటలతో అందరినీ మోసం చేయగల వ్యక్తులు ఎలా ఉంటారు? వారిని కనిపెట్టడం ఎలా?  తెలుసుకుంటే.. ప్రసంశలు.. ఎవరైనా  కలిసిన వెంటనే మితిమీరి పొగడటం మొదలుపెట్టినా లేదా రాత్రికి రాత్రే మిమ్మల్ని ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన వ్యక్తిగా ప్రకటించినా, జాగ్రత్తగా ఉండాలి. మోసం చేసే వ్యక్తులు  వారిని గుడ్డిగా నమ్ముతారనే ఆశతో, మొదట్లో  ప్రేమను, పొగడ్తలను కురిపిస్తారు. మీకు వాళ్ల మీద  నమ్మకం ఏర్పడిన తర్వాత, వారి నిజ స్వరూపం బయటపడుతుంది. తప్పు ఒకరిది, అవమానం మరొకరిది.. తీయని మాటలతో మోసం చేసే వ్యక్తుల ముఖ్య లక్షణం ఏమిటంటే, వారు తమ తప్పులను ఎన్నడూ ఒప్పుకోరు . ఒకవేళ మీరు వారు తప్పు చేయడం మీరు గమనించినా, వారు ఆ పరిస్థితిని ఎంత చాకచక్యంగా వాడుకుంటారంటే, చివరికి మీకే అపరాధభావం కలుగుతుంది. మీరు తప్పు చేశారని మీకు అనిపించేలా  చేస్తారు. తమని తాము అనుమానించుకునేలా.. "నేను అలా ఎప్పుడూ అనలేదు," అనడం లేదా..  "నీకే పిచ్చి, అది అసలు ఎప్పుడు జరిగింది, అలాంటిదేం  జరగలేదు." వంటి  మాటలు ఎవరినుండైనా ఎదురవుతూ ఉంటే..  జాగ్రత్తగా ఉండాల్సిందే.. ఇతరులను తమ చెప్పుచేతల్లో ఉంచుకునేవారు తరచుగా మీకు ఎంత నమ్మకంగా అబద్ధాలు చెబుతారంటే, మీరు మీ జ్ఞాపకశక్తిని, నిజాయితీని మీరే అనుమానించడం మొదలుపెడతారు. ఇది మనసును నియంత్రించడంలో చాలా ప్రమాదకరమైన పద్ధతి. అయ్యో పాపం అనుకునేలా చేయడం.. పరిస్థితులు ఎలా ఉన్నా, తప్పు ఎవరిదైనా సరే, తియ్యని మాటలతో మోసం చేసే  వ్యక్తులు తామే ప్రపంచంలో చాలా బాధలో ఉన్నవారమన్నట్లుగా కథను చెబుతారు. వారు మీ సానుభూతిని పొందాలని చూస్తారు, తద్వారా మీరు వారి పట్ల జాలిపడి, వారు చెప్పే ప్రతిదానితో ఏకీభవించి వారి గురించి పాపం అనుకునేలా చేస్తారు. ఇష్టమైన వారి నుండి వేరు చేయడం.. మిమ్మల్ని లొంగదీసుకోవాలనుకునే వ్యక్తి, మొదట మిమ్మల్ని మీ నిజమైన స్నేహితులు , కుటుంబ సభ్యుల నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తారు. "మీ కుటుంబం మిమ్మల్ని అర్థం చేసుకోదు" లేదా "మీకు ఉన్నది నేను ఒక్కడినే" అనే ఆలోచనలను  మనసులో నాటుతారు. మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నారని, వారిపై ఆధారపడి ఉన్నారని భావించేలా చేయడానికి వారు ఇలా చేస్తారు. అవసరం.. అవసరానికి మాత్రమే మాట్లాడేవారు, మిగతా సమయాలలో తప్పించుకోవడం లేదా కారణాలు, సాకులు చెప్పి దూరంగా ఉండటం చేసేవారు మోసం చేసే స్వభావం కలిగినవారని అర్థం.  ఇలాంటి వారు తమకు అవసరం వచ్చినప్పుడు  చాలా మంచివారిలా ఉంటారు, కానీ వారి పని పూర్తయిన వెంటనే, మిమ్మల్ని మళ్లీ పట్టించుకోవడం మానేస్తారు . తియ్యగా మాట్లాడేవారిని గుర్తించడం కష్టం, ఎందుకంటే వారు తరచుగా చాలా బాగా నటిస్తారు. కానీ ఎప్పుడూ మీ అంతరాత్మ చెప్పేది వినాలి. ఒక సంబంధం మీకు సంతోషానికి బదులుగా ఎప్పుడూ మానసిక గందరగోళాన్ని, ఒత్తిడిని కలిగిస్తుంటే, హద్దులు పెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం.                                    *రూపశ్రీ.
భార్యాభర్తల బంధం విచ్చిన్నం కాకుండా కాపాడే బంగారు సూత్రం! నేటి వేగవంతమైన జీవితంలో మనుషులకు అన్ని భౌతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, రెండు విషయాలలో మాత్రం  వెనుకబడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మొదటిది గాఢమైన, నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం కాగా, రెండవది మనశ్శాంతి లేకపోవడం. ఇవి ప్రస్తుతం చాలామంది  ఎదుర్కొంటున్న అతిపెద్ద ఛాలెంజ్ లు. ముఖ్యంగా బార్యాభర్తల బంధం ఈ కాలంలో చాలా బలహీనంగా మారింది.  బంధాలను కాపాడుకోవడం,  మనఃశాంతిగా ఉండటం.. ఈ రెండింటిని ఎలా సమతుల్యం చేసుకోవాలనేదే అతిపెద్ద గందరగోళం. అయితే ఈ విషయానికి సమాధానం లేదా అంటే.. ఖచ్చితంగా ఉంది. బంధాలు నిలబెట్టుకోవడానికి బంగారు సూత్రం ఉంది. అదేంటో తెలుసుకుంటే.. బంధాలకు బంగారు సూత్రం.. నేటి వివాహాలు, సంబంధాలలో ఉన్న అతిపెద్ద బలహీనతను  ఎదుటి వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోకపోవడమే.  బంధం బాగుండాలంటే బంధం ముడిపడేవరకు  కళ్ళు తెరిచి ఉండాలి, కానీ బంధం ముడిపడిన తర్వాత కళ్లు మూసుకుని ఉండాలట. ఈ విషయాన్ని  స్వయానా సినీ నటుడు, రచయిత, ఆధ్యాత్మిక వేత్త అయిన అశుతోష్ రాణా చెప్పుకొచ్చారు.  ఈయన తెలుగులో కూడా చాలా సినిమాలలో నటించారు.   ఒకరితో సంబంధంలోకి వచ్చాక, కళ్ళు మూసుకోవాలని ఆయన అంటున్నారు. దీని అర్థం ఏమిటంటే, ఒక సంబంధం ఏర్పడిన తర్వాత, ప్రతి చిన్న లోపాన్ని పట్టుకుని విమర్శించడం లేదా ఫిర్యాదు చేయడం కంటే, కొన్ని విషయాలను పట్టించుకోకుండా ఉండటం ముఖ్యమని అర్థం. ఈ ప్రపంచంలో ఏ మనిషి అన్ని విషయాలలోనూ పర్పెక్ట్ గా ఉండరు.  ప్రతి ఒక్కరిలోనూ కొన్ని చెడు అలవాట్లు, తప్పు చేసే స్వబావం, కొన్ని లోపాలు ఉంటాయి.   భగవద్గీతలోని పద్దెనిమిదవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు, అగ్ని ఎల్లప్పుడూ పొగతో కప్పబడి ఉన్నట్లే, ప్రతి మనిషిలోనూ, ప్రతి చర్యలోనూ ఏదో ఒక లోపం లేదా దోషం ఉంటుందని పేర్కొన్నాడు. వివాహం విషయానికి వస్తే..  సీతాదేవి , శ్రీరాముని జీవితంలో కనిపించేది  సమతుల్యత. అక్కడ వివాహానికి ముందు రాముడి  యోగ్యతను పరీక్షించినప్పటికీ, వివాహం తర్వాత వారిద్దరూ ఒకరి పరిమితులను మరొకరు అంగీకరించి, ప్రేమ , కర్తవ్యానికి మాత్రమే ఎక్కువ  ప్రాధాన్యతనిచ్చారు. ఈ రోజుల్లో పెళ్లి తర్వాత చాలామంది తమ భాగస్వాములను మార్చుకోవాలని ప్రయత్నించడం వల్ల సంబంధాలు త్వరగా నాశనం అవుతున్నాయనేది చాలా మంది అర్థం చేసుకోరు, అయితే సగం కళ్ళు మూసుకోవడం అంటే ఉదాసీనత కాదు, అది ఎదుటి వ్యక్తిలోని లోపాలను అంగీకరించే పరిణతి. ప్రతి వ్యక్తకి తమ సమస్యలకు పరిష్కారాలు తమలోనే ఉంటాయి. కానీ వచ్చిన చిక్కల్లా తమని తాము విమర్శ చేసుకోలేక పోవడం, అలాగే..  తమకు నచ్చిన విధంగానే పరిష్కారం జరగాలని అనుకోవడం. ఇదే చాలామంది సమస్యలు పెద్దవి అవడానికి,  మనఃశాంతి లేకపోవడానికి దారి తీస్తుంది.  బందం బలంగా ఉండాలంటే చిన్న విషయాలను పట్టించుకోవడం మానెయ్యాలి. అదే బంగారు సూత్రం.                                           *రూపశ్రీ.  
శరీరంలో అధిక వేడి, పాదాల్లో మంట, కళ్లలో మంట, నోటి పూత, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఈ లక్షణాలు సాధారణంగా కనిపించినప్పటికీ, ఆయుర్వేదం ప్రకారం ఇవి పిత్త దోషం (Pitta Dosha) పెరగడం వల్ల వచ్చే సంకేతాలు కావచ్చని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా. చి. మధుసూదన్ శర్మ వివరిస్తున్నారు. ఈ వీడియోలో పిత్త దోషం ఎందుకు పెరుగుతుంది? దానికి కారణమయ్యే ఆహారపు అలవాట్లు, జీవనశైలి, వాతావరణ ప్రభావాలు ఏమిటి? అలాగే పిత్తాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన ఆహారం, పాటించాల్సిన జీవనశైలి, ఆయుర్వేదంలో సూచించే సహజ చిట్కాలు వంటి అనేక ఉపయోగకరమైన విషయాలను సులభంగా వివరించారు. శరీరంలో వేడి ఎక్కువగా అనిపించడం, పాదాల్లో లేదా కళ్లలో మంట, తరచూ నోటి పూత రావడం, గ్యాస్, అసిడిటీ సమస్యలు వేధిస్తుంటే ఈ వీడియోలో చెప్పిన సూచనలు మీకు ఉపయోగపడవచ్చు. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: పిత్త దోషం అంటే ఏమిటి? శరీరంలో వేడి పెరగడానికి ప్రధాన కారణాలు పాదాలు, కళ్లలో మంట ఎందుకు వస్తుంది? నోటి పూత, గ్యాస్, అసిడిటీకి ఆయుర్వేద వివరణ పిత్తాన్ని తగ్గించే ఆహారాలు నివారించాల్సిన ఆహార పదార్థాలు రోజువారీ జీవితంలో పాటించాల్సిన ఆరోగ్యకరమైన అలవాట్లు సహజంగా శరీరాన్ని చల్లగా ఉంచే ఆయుర్వేద సూచనలు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, పిత్త దోషాన్ని సమతుల్యం చేసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆయుర్వేద అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత ఆరోగ్య సమస్యల కోసం తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యుడిని లేదా ఆయుర్వేద నిపుణుడిని సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
పురుషుల ఆరోగ్యం విషయంలో చాలామంది నిర్లక్ష్యం చేసే సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. ప్రారంభ దశలోనే గుర్తిస్తే చాలా రకాల క్యాన్సర్లను విజయవంతంగా చికిత్స చేయవచ్చు. అయితే లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల వ్యాధి ముదిరే ప్రమాదం ఉంటుంది. ఈ వీడియోలో ప్రముఖ యూరాలజిస్టు, ఆండ్రాలజిస్టు డా. ఏవి రవి కుమార్ పురుషుల్లో ఎక్కువగా కనిపించే ఐదు ప్రధాన క్యాన్సర్ల గురించి సులభంగా వివరించారు. ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్, మూత్రాశయ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, వృషణాల క్యాన్సర్, పురుషాంగ క్యాన్సర్ వంటి వ్యాధుల లక్షణాలు, ప్రమాద కారకాలు, ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి అనే అంశాలను తెలియజేశారు.  అలాగే చాలామందికి ఉండే సందేహమైన యూరాలజీ (Urology) మరియు ఆండ్రాలజీ (Andrology) మధ్య ఉన్న తేడాను కూడా స్పష్టంగా వివరించారు. మూత్ర సంబంధిత వ్యాధులు, పురుషుల లైంగిక ఆరోగ్యం, సంతానలేమి సమస్యలు, ప్రోస్టేట్ సమస్యలు వంటి సందర్భాల్లో ఏ నిపుణుడిని సంప్రదించాలో ఈ ఇంటర్వ్యూలో తెలుసుకోవచ్చు.  పురుషులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు? క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు ఎందుకు అవసరం? వంటి ఎన్నో ఉపయోగకరమైన విషయాలను ఈ వీడియోలో డా. ఏవి రవి కుమార్ వివరించారు.  ప్రతి పురుషుడు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆరోగ్య సమాచారం కోసం ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.   మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
భారతదేశంలో టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక అలవాటుగా , రోజును మొదలుపెట్టడానికి మంచి ఎనర్జీ డ్రింక్ గా కూడా భావిస్తారు. ఉదయం లేవగానే టీ తాగడం, పనిలో బ్రేక్  సమయంలో టీ తాగడం, సాయంత్రం స్నేహితులతో కలిసి టీని ఎంజాయ్ చేయడం.. ఇలా దాదాపు ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ లో టీ  ఒక భాగం. కొందరు టీ తాగనిది ఏ పని చేయలేరు.. టీ తాగడం అనేది ఒక పెద్ద బలహీనతగా మారినవాళ్లు ఉంటారు. కానీ  ఒక నెల పాటు టీ తాగడం మానేస్తే  శరీరంలో జరిగే మార్పుల గురించి చాలా మందికి తెలియదు.  కనీసం ఒక నెలరోజుల పాటు టీ తాగడం మానేస్తే అద్భుతాలు జరుగుతాయని  ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే..  నిద్ర నాణ్యత.. టీలోని కెఫీన్ ఒక ఉత్ప్రేరకంగా పనిచేసి, మెదడును చురుకుగా ఉంచుతూ, నిద్ర పట్టే ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. టీ తాగడం మానేసినప్పుడు, శరీరంలో కెఫీన్ ప్రభావం క్రమంగా తగ్గుతుంది. ఇది త్వరగా నిద్రపోవడానికి సహాయపడటమే కాకుండా, నిద్ర గాఢతను కూడా మెరుగుపరుస్తుంది.  టీ మానేసిన తర్వాత రాత్రిపూట తరచుగా వచ్చే నిద్రలేమి సమస్య కూడా తగ్గుతుందని చాలా మంది చెబుతారు. ఎసిడిటి, గ్యాస్.. ఎక్కువగా టీ తాగడం వల్ల కడుపులో ఆమ్లం ఉత్పత్తి పెరిగి, అసిడిటీ, గుండెల్లో మంట, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.  ముఖ్యంగా ఖాళీ కడుపుతో టీ తాగడం జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది.   టీ మానేయడం వల్ల, కడుపులోని ఆమ్లం బ్యాలెన్స్ మెరుగుపడి, జీర్ణక్రియ క్రమంగా సాధారణ స్థితికి వస్తుంది. దీనివల్ల కడుపు తేలికగా, సౌకర్యవంతంగా అనిపిస్తుంది. దంత ఆరోగ్యం.. టీలోని టానిన్లు దంతాలు మరకలు పడటానికి . పసుపు రంగులోకి మారడానికి కారణమవుతాయి. ఎక్కువ కాలం పాటు అధికంగా టీ తాగడం వల్ల దంతాల మెరుపు తగ్గుతుంది. టీ మానేయడం వల్ల దంతాలపై కొత్తగా మరకలు ఏర్పడటం తగ్గి, నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.  క్రమం తప్పకుండా బ్రష్ చేయడం వల్ల దంతాలు శుభ్రంగా, ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఒత్తిడి, ఆందోళన.. అధిక మోతాదులో కెఫిన్ తీసుకోవడం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెరిగి, ఆందోళన, చంచలత్వం , భయం వంటి సమస్యలు ఏర్పడతాయి. టీ మానేసిన తర్వాత మనసు మరింత ప్రశాంతంగా ఉంటుంది, అలాగే మూడ్ స్వింగ్స్ కూడా తగ్గుతాయి. ఇది మానసిక స్థిరత్వాన్ని, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. చర్మం..  టీకి బదులుగా నీరు , ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవడం  వల్ల, టీ మానేయడం వల్ల  శరీరం మరింత హైడ్రేటెడ్‌గా ఉండటానికి సహాయపడుతుంది.  తేమ పెరగడం వల్ల చర్మం మరింత కాంతివంతంగా, తాజాగా కనిపిస్తుంది. శరీరంలోని విషపదార్థాలను తగ్గించడం వల్ల పొడిబారడం, కాంతిహీనత వంటి చర్మ సమస్యలను కూడా నయం అయ్యి,  చర్మం మెరుపు పెరుగుతుంది. గుండె ఆరోగ్యం.. అధికంగా కెఫిన్ తీసుకోవడం కొంతమందిలో రక్తపోటు , హృదయ స్పందన రేటుపై ప్రభావం చూపుతుంది. టీ తాగడాన్ని తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం వల్ల గుండెపై ఒత్తిడి తగ్గి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆహార నిపుణులు, వైద్యులు చెబుతారు.                                     *రూపశ్రీ.